పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ (జీఎస్ టి)లోని ఇంజనీరింగ్ విభాగాల మధ్య ఆవిష్కరణలు, సహకారాన్ని పెంపొందించడానికి నెలకొల్పిన రీసెర్స్ స్పేస్ ను జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) జనరల్ మేనేజర్ (పరిశోధన-అభివృద్ధి) ఎస్.కె. చౌరాసియా లాంఛనంగా ప్రారంభించారు.ఇది మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్, ఈఈసీఈ, సీఎస్ఈ విభాగాలకు ఉమ్మడి కేంద్రంగా పనిచేస్తుందని, ఆవిష్కరణ, పరిశోధనా నై పుణ్యాన్ని పెంచడానికి ఉపకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతికను అందిపుచ్చుకుని మంచి ఆవిష్కరణలు చేయడానికి దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆధ్యాపకులు, పరిశోధక విద్యార్థులకు చౌరాసియా సూచించారు. ఈ అధునాత రీసెర్చ్ స్పేస్లో ఇరవె అత్యాధునిక కంప్యూటర్లను నెలకొల్పామని, ఒక్కొక్కటీ 13వ తరం ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్లతో 4.5 గిగాహెడ్జ్ సామర్థ్యం, 8 జీబీ రామ్ పనిచేస్తాయని, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరక్టర్ కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ ని, రామశాస్త్రి వివరించారు. వినూత్న పరిశోధన, ఆచరణాత్మక అభ్యాసం ద్వారా ఇంజనీరింగ్ జ్ఞానం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఈ రీసెర్చ్ స్పేస్ ను అంకితం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఈ ప్రారంభోత్సవంలో పలు విభాగాల అధిపతులు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…