Telangana

కేఎస్ ఆర్ కాలనీ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

కేఎస్ ఆర్ కాలనీ అభివృద్ధి కోసం కృషి

కాలనీ నూతన అధ్యక్షుడు మైదం భాస్కర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కేఎస్ఆర్ కాలనీ అభివృద్ధి, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్లన్నట్లు కాలనీ నూతన అధ్యక్షులు మైదం భాస్కర్(ఎల్ఐసి)పేర్కొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కె ఎస్ ఆర్ కాలనీ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ను ఎన్నికల అధికారి సంగారెడ్డి కోర్టు అడ్వకేట్ డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మైదం భాస్కర్ (ఎల్ఐసి) కొనపాల భాస్కర్ ప్యానల్ మధ్య జరిగిన ఎన్నికల్లో మైదం భాస్కర్ ప్యానల్ గెలుపొందింది.అసోసియేషన్ అధ్యక్షులుగా మైదం భాస్కర్ ( ఎల్ఐసి), ప్రధాన కార్యదర్శిగా పావంత్స శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఈ మల్లికార్జున్ రావు, సంయుక్త కార్యదర్శిగా రూపక్ బైద్య, కోశాధికారిగా యన్మన్ గండ్ల ఆదిత్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మైదం భాస్కర్ మాట్లాడుతూ కేఎస్ఆర్ కాలనీ వాసులందరినీ కలుపుకొని సమస్యలను పరిష్కరిస్తూ కాలనీ అభివృద్దే ధ్యేయంగా అసోసియేషన్ నూతన కార్యవర్గం ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago