కేఎస్ ఆర్ కాలనీ అభివృద్ధి కోసం కృషి
కాలనీ నూతన అధ్యక్షుడు మైదం భాస్కర్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కేఎస్ఆర్ కాలనీ అభివృద్ధి, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్లన్నట్లు కాలనీ నూతన అధ్యక్షులు మైదం భాస్కర్(ఎల్ఐసి)పేర్కొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కె ఎస్ ఆర్ కాలనీ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ను ఎన్నికల అధికారి సంగారెడ్డి కోర్టు అడ్వకేట్ డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మైదం భాస్కర్ (ఎల్ఐసి) కొనపాల భాస్కర్ ప్యానల్ మధ్య జరిగిన ఎన్నికల్లో మైదం భాస్కర్ ప్యానల్ గెలుపొందింది.అసోసియేషన్ అధ్యక్షులుగా మైదం భాస్కర్ ( ఎల్ఐసి), ప్రధాన కార్యదర్శిగా పావంత్స శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా ఈ మల్లికార్జున్ రావు, సంయుక్త కార్యదర్శిగా రూపక్ బైద్య, కోశాధికారిగా యన్మన్ గండ్ల ఆదిత్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మైదం భాస్కర్ మాట్లాడుతూ కేఎస్ఆర్ కాలనీ వాసులందరినీ కలుపుకొని సమస్యలను పరిష్కరిస్తూ కాలనీ అభివృద్దే ధ్యేయంగా అసోసియేషన్ నూతన కార్యవర్గం ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…