విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రాధాన్యత..
-వారంతా వ్యాక్సిన్ సర్టిఫికెట్ను పాస్పోర్టుకు అనుసంధానించాలి
-విదేశాలకు వెళ్లాలనుకునే వారిని అనుసంధానం తప్పనిసరి
-రెండు డోసుల మధ్య విరామం తగ్గింపునకు అనుమతి
-28రోజుల తర్వాత కొవిషీల్డ్ రెండో డోసుల తీసుకోవచ్చని స్పష్టం
హైదరాబాద్:
విద్య, ఉద్యోగం, టోక్యో ఒలింపిక్స్ సహా ఇతర పనుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు తమ కొవిన్ ఆధారిత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను పాస్పోర్ట్కు తప్పనిసరిగా అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వ తెలిపింది. అలాగే వీరిలో ఇప్పటికే తొలి డోసు తీసుకున్నవారు 28 రోజుల తర్వాత కొవిషీల్డ్ రెండో డోసు తీసుకునేందుకు అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆదేశించింది. కొవిడ్ షీల్డ్ రెండు డోసుల మధ్య విరామాన్ని 84 రోజుల వరకు పెంచిన విషయం తెలిసిందే. అయితే, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది.
అనుసంధాన ప్రక్రియలో వ్యాక్సిన్ రకం అనే ఆప్షన్ దగ్గర కొవిషీల్డ్ అని పెడితే సరిపోతుందని స్పష్టం చేసింది. ఇతర ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోన్న కొవిషీల్డ్ వ్యాక్సిన్కు డబ్ల్యూహెచ్ అనుమతి ఉందని స్పష్టం చేసింది.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…