Telangana

పర్యావరణ పరిరక్షణకు విద్యాసంస్థలు నడుం బిగించాలి… – డాక్టర్ శివాజీరావు థార్మికోపన్యాసంలో పర్యావరణవేత్త ఎంసీ మెహతా పిలుపు

పర్యావరణ పరిరక్షణకు విద్యాసంస్థలు నడుం బిగించాలి... – డాక్టర్ శివాజీరావు

పటాన్ చెరు:

నిరంతరాయంగా పెరుగుతున్న జనాభా , మారుతున్న జీవన విధానాలు పర్యావరణానికి మరింత చేటు చేస్తున్నాయని , పర్యావరణ పరిరక్షణకు ఉన్నత విద్యా సంస్థలు నడుం బిగించాలని ప్రముఖ పర్యావరణవేత్త , సుప్రీంకోర్టు న్యాయవాది ఎం.సీ.మెహతా పిలుపునిచ్చారు . గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ( జీఎస్ హెచ్ఎస్ ) , ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోని పర్యావరణ శాస్త్ర విభాగాలు సంయుక్తంగా ఆదివారం ఆన్ లైన్ లో నిర్వహించిన ‘ ప్రొఫెసర్ టి.శివాజీరావు థార్మికోపన్యాసం’లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు .

ఈ సందర్భంగా మాట్లాడుతూ… పర్యావరణం పరిరక్షణ ఆవశ్యకత , లేకపోతే తలత్తే పరిణామాలను విద్యార్థులు , సామాన్య ప్రజలకు వివరించి , దాని పరిరక్షణకు వారందరినీ సమాయత్తం చేయాలని సూచించారు . కరవు లేదా కాలుష్యంతో సతమతమవుతున్న ప్రాంతాలకు విద్యార్థులను పంపి , దాని నుంచి వారు స్వీయ అనుభవం పొందేలా చూడాలని ఆయన సలహా ఇచ్చారు . ప్రొఫెసర్ శివాజీరావుతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకుంటూ , కాలుష్యం వల్ల తాజ్ మహలకు జరుగుతున్న నష్టంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశామని , దానికి అవసరమైన నేపథ్య రూపకల్పనలో శివాజీ ఎంతో సహకరించినట్టు తెలిపారు .

అలాగే మధురై , పటాన్ చెరు పారిశ్రామికవాడల చుట్టుపక్కల ప్రజలపై కాలుష్య ప్రభావం వంటి పలు అంశాలపై వ్యాజ్యాలను దాఖలుచేసి , పర్యావరణ పరిరక్షణకు తమవంతు సహకారం అందించామన్నారు . ప్రతి పౌరుడికీ మంచి గాలిని పీల్చే , మంచి నీటిని తాగే హక్కు జన్మతహః వస్తాయని , అవి ప్రకృతి ప్రసాదించిన వరాలని , కానీ ప్రస్తుతం వాటిని కొనాల్సిన దుస్థితి ఏర్పడడంపై ఆయన విచారం వెలిబుచ్చారు . ప్రతీ పౌరుడూ పుట్టుకతోనే పర్యావరణవేత్తని , కాలుష్యం వల్ల తలెత్తే పరిణామాలను గ్రహించకపోతే పర్యావరణాన్ని పరిరక్షించలేమని ఆయన చెప్పారు .

మేధావులకు విశ్రాంత జీవనం అనేది ఉండదని , వారంతా పర్యావరణ పరిరక్షణకు ఉద్యమించాలని మెహతా పిలుపునిచ్చారు . తొలుత , గీతం ఉపకులపతి ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ , డాక్టర్ శివాజీరావు సేవలను స్మరించుకుంటూ , పర్యావరణ శాస్త్రాన్ని గీతమ్ లో ప్రవేశపెట్టడంలో ఆయన అందించిన ఇతోధిక సాయాన్ని గుర్తుచేసుకున్నారు . అభివృద్ధి పేరిట ప్రకృతి విరుద్ధంగా వ్యవహరిస్తున్నామని , అది శృతిమించితే ప్రకృతే దానిని సమతుల్యం చేస్తుందని ఆయన హెచ్చరించారు . గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే మని మనకు నష్టం చేస్తుందని , మానవ మనుగడ కోసం ప్రకృతిని కాపాడుకోవాలని సూచించారు . జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీవీవీ నాగేంద్రరావు స్వాగతోపన్యాసం చేయగా , కార్యక్రమ నిర్వాహకుడు ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాస్ డాక్టర్ శివాజీ జీవితచరిత్రను క్లుప్తంగా వివరించారు . కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ వి.సరిత వందన సమర్పణతో థార్మికోపన్యాసం ముగిసింది

Ramesh

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

11 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago