Telangana

పర్యావరణ పరిరక్షణకు విద్యాసంస్థలు నడుం బిగించాలి… – డాక్టర్ శివాజీరావు థార్మికోపన్యాసంలో పర్యావరణవేత్త ఎంసీ మెహతా పిలుపు

పర్యావరణ పరిరక్షణకు విద్యాసంస్థలు నడుం బిగించాలి... – డాక్టర్ శివాజీరావు

పటాన్ చెరు:

నిరంతరాయంగా పెరుగుతున్న జనాభా , మారుతున్న జీవన విధానాలు పర్యావరణానికి మరింత చేటు చేస్తున్నాయని , పర్యావరణ పరిరక్షణకు ఉన్నత విద్యా సంస్థలు నడుం బిగించాలని ప్రముఖ పర్యావరణవేత్త , సుప్రీంకోర్టు న్యాయవాది ఎం.సీ.మెహతా పిలుపునిచ్చారు . గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ( జీఎస్ హెచ్ఎస్ ) , ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోని పర్యావరణ శాస్త్ర విభాగాలు సంయుక్తంగా ఆదివారం ఆన్ లైన్ లో నిర్వహించిన ‘ ప్రొఫెసర్ టి.శివాజీరావు థార్మికోపన్యాసం’లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు .

ఈ సందర్భంగా మాట్లాడుతూ… పర్యావరణం పరిరక్షణ ఆవశ్యకత , లేకపోతే తలత్తే పరిణామాలను విద్యార్థులు , సామాన్య ప్రజలకు వివరించి , దాని పరిరక్షణకు వారందరినీ సమాయత్తం చేయాలని సూచించారు . కరవు లేదా కాలుష్యంతో సతమతమవుతున్న ప్రాంతాలకు విద్యార్థులను పంపి , దాని నుంచి వారు స్వీయ అనుభవం పొందేలా చూడాలని ఆయన సలహా ఇచ్చారు . ప్రొఫెసర్ శివాజీరావుతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకుంటూ , కాలుష్యం వల్ల తాజ్ మహలకు జరుగుతున్న నష్టంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశామని , దానికి అవసరమైన నేపథ్య రూపకల్పనలో శివాజీ ఎంతో సహకరించినట్టు తెలిపారు .

అలాగే మధురై , పటాన్ చెరు పారిశ్రామికవాడల చుట్టుపక్కల ప్రజలపై కాలుష్య ప్రభావం వంటి పలు అంశాలపై వ్యాజ్యాలను దాఖలుచేసి , పర్యావరణ పరిరక్షణకు తమవంతు సహకారం అందించామన్నారు . ప్రతి పౌరుడికీ మంచి గాలిని పీల్చే , మంచి నీటిని తాగే హక్కు జన్మతహః వస్తాయని , అవి ప్రకృతి ప్రసాదించిన వరాలని , కానీ ప్రస్తుతం వాటిని కొనాల్సిన దుస్థితి ఏర్పడడంపై ఆయన విచారం వెలిబుచ్చారు . ప్రతీ పౌరుడూ పుట్టుకతోనే పర్యావరణవేత్తని , కాలుష్యం వల్ల తలెత్తే పరిణామాలను గ్రహించకపోతే పర్యావరణాన్ని పరిరక్షించలేమని ఆయన చెప్పారు .

మేధావులకు విశ్రాంత జీవనం అనేది ఉండదని , వారంతా పర్యావరణ పరిరక్షణకు ఉద్యమించాలని మెహతా పిలుపునిచ్చారు . తొలుత , గీతం ఉపకులపతి ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ , డాక్టర్ శివాజీరావు సేవలను స్మరించుకుంటూ , పర్యావరణ శాస్త్రాన్ని గీతమ్ లో ప్రవేశపెట్టడంలో ఆయన అందించిన ఇతోధిక సాయాన్ని గుర్తుచేసుకున్నారు . అభివృద్ధి పేరిట ప్రకృతి విరుద్ధంగా వ్యవహరిస్తున్నామని , అది శృతిమించితే ప్రకృతే దానిని సమతుల్యం చేస్తుందని ఆయన హెచ్చరించారు . గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే మని మనకు నష్టం చేస్తుందని , మానవ మనుగడ కోసం ప్రకృతిని కాపాడుకోవాలని సూచించారు . జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీవీవీ నాగేంద్రరావు స్వాగతోపన్యాసం చేయగా , కార్యక్రమ నిర్వాహకుడు ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాస్ డాక్టర్ శివాజీ జీవితచరిత్రను క్లుప్తంగా వివరించారు . కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ వి.సరిత వందన సమర్పణతో థార్మికోపన్యాసం ముగిసింది

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago