Telangana

ఐసీడీఎస్ మంత్రి తప్పుడు ప్రచారం మానుకోవాలి : సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య

– మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం

_పటాన్ చెరు శ్రామిక భవన్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ – సభ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ఐసిడిఎస్ మంత్రి ఈనెల 22 న మాట్లాడిన వాక్యలను త్రీవంగా కండిస్తున్నట్లు, ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని లేదంటే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం పటాన్ చెరు శ్రామిక భవన్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం జరిగిన సభ లో రాజయ్య మాట్లాడుతు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా అన్ని పరిష్కారం చేశామని ఐసిడిఎస్ మత్రి మాట్లాడటం అత్యంత దుర్మార్గమని మంత్రే ఆగస్ట్ 18 న చర్చలు జరిపారని, నిర్దిష్టంగా కొన్నింటి పైన హామీలు ఇచ్చారని, అదే మంత్రి ఆగస్ట్ 25 న ఇచ్చిన హామీలకు బిన్నంగా, మోసం చేస్తూ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సగానికి తగ్గించి ప్రకటన చేయటం దారుణమన్నారు. ప్రభుత్వం చేసిన మోసాన్ని కప్పి పుచ్చి, అంగన్వాడీ ఉద్యోగులు న్యాయంగా చేస్తున్న సమ్మె పైన దాడి చేయడం అత్యంత హేమమైన చర్య అన్నారు.అంగన్వాడీ ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని అడుగుతుంటే, ఈ అంశాన్ని పక్కన బెట్టి కేంద్రం చుట్టూ తిప్పాలని చూడటం సరైంది కాదన్నారు. కేంద్రానికి సంబంధం లేకుండా అనేక రాష్ట్రాలు, అనేక సౌకర్యాలను అంగన్వాడీ ఉద్యోగులకు అందిస్తున్నట్లు గుర్తు చేశారు. అలాగే ఇక్కడ కూడా సౌకర్యాలు కల్పించాలని అంగన్వాడీ ఉద్యోగులు అడగటం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు.

ఇత రాష్ట్రాల గురించి మాట్లాడే ముందు మంత్రి తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలలో అంగన్వాడీ ఉద్యోగుల పర్మినెంట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.4 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్న అస్సాం గురించి,3 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్న పచ్చిమ బెంగాల్ గురించి ఎందుకు దాచిపెడుతున్నారో చెప్పాలన్నారు, వెల్ఫేర్ బోర్డ్ తో పాటు పెన్షన్ ఇస్తున్న కేరళ గురించి, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇస్తున్న కర్ణాటక గురించి ఎందుకు మాట్లాడటం లేదని అడుగుతున్నామన్నారు.మంత్రి అనేక రాష్ట్రాల లో ఇస్తున్న వేతనాలు కూడా ఉన్నది ఉన్నట్టు కాకుండా తక్కువ చేసి చూపిస్తూ పచ్చి అబద్ధాలు ఆడటం, కేంద్రం 2018 లో వేతనాలు పెంచితే ఈ అంశాన్ని కూడా పరిగనలోకి తీసుకోకుండా పైగా ఏమీ పెంచలేదని అబద్దమాడటం మంత్రి హోదా లో ఉన్న వారికి ఇది సరైంది కాదన్నారు.పే స్కేల్ లేకుండా బేసిక్ వేతనం నిర్ణయం చేయకుండ పి ఆర్ సి లో కలిపితే మాకు న్యాయం ఎలా జరిగిందో మంత్రి చెప్పాలన్నారు.అంగన్వాడీ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 4,500 లు ఇస్తున్నదని. తెలంగాణ కు ముందు అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు 1200 చెల్లించారని. ఇవి మినహాయిస్తే తెలంగాణ ప్రభుత్వం ఇచేది కేవలం 7,950 మాత్రమేనాని. దీనిని మరుగున పరిచి మొత్తం మేమే ఇస్తున్నామని చెప్పటం సిగ్గుచేటన్నారు.

ధనిక రాష్ట్రమని చెప్తున్న ప్రభుత్వం వెనక పడ్డ రాష్ట్రాల వేతనాలతో పోల్చ కూడదన్నారు. అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేసిన తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలతో పోల్చుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటి కైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న పోరాటం పట్ల తన వ్యతిరేక వైఖరిని, అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని, సమ్మె లో ఉన్న సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు అంగన్వాడి టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

21 minutes ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

3 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

2 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago