_అర్హులకు కాకుండా అనర్హులకు ఇళ్లు..
_సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి నాయిని నరసింహారెడ్డి
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
డబుల్ బెడ్ రూమ్ పథకం పూర్తిగా అవినీతిమయం గా మారిందని సీపీఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు.పార్టీ అధ్వర్యంలో స్థానిక మండల కార్యాలయం లో జూనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సంధర్బంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ పటాన్ చెరు నియోజక వర్గంలో నిజమైన పేదలకు కాకుండ కొంత మంది అనర్హులకు ఇళ్లు మంజూరు చేశారని విమర్శించారు.నియోజక వర్గంలోని అనేక పరిశ్రమలలో వేలాది మంది కాంట్రాక్టు కార్మికులు, భవన్ నిర్మాణ కార్మికులు, ఇండ్లల్లో పని చేసే వాళ్ళు, అటో డ్రైవర్లు, మట్టి పని వాళ్ళు, ట్రాక్టర్ డ్రైవర్లు ఇలా వేలాది మంది పేదలు గత అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని అన్నారు. వీరికి కాకుండ తెల్ల రేషన్ కార్డు లేని వారికి, స్థానికంగా నివాసం లేని వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉన్న వారికి ఇళ్లు మంజూరు చేశారని విమర్శించారు. అనర్హులను తొలగించాలని, అరుహులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ అధ్వర్యంలో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కార్యక్రమంలో జయకుమార్, ఆంజనేయులు బుచ్చిరెడ్డి,శ్రీనివాస్,రాజు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…