Telangana

అవినీతి మయం అయినా డబుల్ బెడ్ రూమ్ పథకం

_అర్హులకు కాకుండా అనర్హులకు ఇళ్లు..

_సిపిఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి నాయిని నరసింహారెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

డబుల్ బెడ్ రూమ్ పథకం పూర్తిగా అవినీతిమయం గా మారిందని సీపీఎం పార్టీ పటాన్ చెరు ఏరియా కమిటీ కార్యదర్శి నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు.పార్టీ అధ్వర్యంలో స్థానిక మండల కార్యాలయం లో జూనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సంధర్బంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ పటాన్ చెరు నియోజక వర్గంలో నిజమైన పేదలకు కాకుండ కొంత మంది అనర్హులకు ఇళ్లు మంజూరు చేశారని విమర్శించారు.నియోజక వర్గంలోని అనేక పరిశ్రమలలో వేలాది మంది కాంట్రాక్టు కార్మికులు, భవన్ నిర్మాణ కార్మికులు, ఇండ్లల్లో పని చేసే వాళ్ళు, అటో డ్రైవర్లు, మట్టి పని వాళ్ళు, ట్రాక్టర్ డ్రైవర్లు ఇలా వేలాది మంది పేదలు గత అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని అన్నారు. వీరికి కాకుండ తెల్ల రేషన్ కార్డు లేని వారికి, స్థానికంగా నివాసం లేని వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉన్న వారికి ఇళ్లు మంజూరు చేశారని విమర్శించారు. అనర్హులను తొలగించాలని, అరుహులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్టీ అధ్వర్యంలో ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కార్యక్రమంలో జయకుమార్, ఆంజనేయులు బుచ్చిరెడ్డి,శ్రీనివాస్,రాజు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago