పటాన్చెరు:
20 సంవత్సరాల పిన్న వయసులో కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ద్విచక్ర వాహనంపై ప్రయాణం సాగిస్తూ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్న హైదరాబాద్ రైడర్ ప్రియ నేటి యువతకు ఆదర్శమని పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణం శాంతి నగర్ కాలనీకి చెందిన ప్రియ స్వతహాగా బైక్ రైడర్. హైదరాబాద్ నుండి కేదార్నాథ్ వరకు సోలో రైడ్ పూర్తిచేసిన మొట్టమొదటి అమ్మాయి ప్రియా. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ వేయించుకోవాలి అంటూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రారంభించిన రైడ్ పటాన్చెరుకు చేరుకుంది. స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శాలువా కప్పి ఆమెకు అభినందనలు తెలిపారు.
ప్రియా సాగిస్తున్న ప్రయాణం నేటి యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం పేరును దేశ స్థాయిలో నిలపడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, వీరా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…