politics

మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం

మనవార్తలు ,హైదరాబాద్ :

ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్స్ వారు 120 మంది మహిళా వైద్యులకు వారి సేవలను గుర్తించి అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంమాదాపూర్ లోని నోవొటెల్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానానికి ముఖ్యఅతిధిగా సైబరాబాద్ డీసీపీ, షీ టీమ్ ఇంచార్జ్ సి అనసూయ మరియు మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి, మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిధిగా సైబరాబాద్ డీసీపీ షీటీమ్ ఇంచార్జ్ సి.అనసూయ మాట్లాడుతూ మహిళలు సమిష్టిగా స్థాపించిన ఈ రోజు, లింగ సమానత్వం, మహిళల హక్కులపై కూడా దృష్టి పెడుతుందని మరియు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆశిస్తున్నానని అన్నారు.

మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ బ్రేక్ ద బయాస్ అనే థీమ్ తో మనం ఈ సంవత్సరం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం.దీని యొక్క ముఖ్య ఉద్దెశం పురుషులతో పాటు మహిళలు సమానులే అని గుర్తించాలని. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమంగా రాణిస్తున్నారని వాళ్ళు ఇంకా ఎన్నో మైలురాయిల్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు.అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా డాక్టర్స్ కు వారి సేవలను గుర్తించి అవార్డులను అందజేశారు.

క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్ వారు ఇంత గొప్ప కార్యక్రమం వివిధ హాస్పిటల్స్ డాక్టర్స్ ని పిలిచి వారి సేవలను గుర్తించి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు చాల సంతోషంగా ఉoదని. కోవిడ్ సమయంలో వైద్యుల సేవలు మనం మరువలేనివని మహిళలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందటం చాలా సంతోషంగా ఉoదని మున్ముందు ఎన్నో విజయాలను అందుకోవాలని కోరుంటున్నామని అన్నారు.

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

13 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

14 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago