Hyderabad

పండ్లు మగ్గబెట్టే మిక్చర్‌ ఎన్‌రైప్‌ ను ఆవిష్కరించిన హోంమంత్రి

మగ్గబెట్టే మిక్చర్‌ ఎన్‌రైప్‌ ను ఆవిష్కరించిన హోంమంత్రి
– పండ్లను సహజసిద్ధంగా మగ్గబెట్టే మిక్చర్‌ ‘ఎన్‌రైప్‌’ ఆవిష్కరణ
– చైనా విషరసాయనాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదన్న హోంమంత్రి
హైదరాబాద్:
సీజనల్ పండ్లను సహజసిద్ధంగా మగ్గబెట్టే మిక్చర్‌ ‘ఎన్‌రైప్‌’ ను రాష్ట్ర హోంమంత్రి మమమూద్ అలీ ఆవిష్కరించారు.
హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో  హోంమంత్రి హమూద్ అలీ తో పాటు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీభాయి, టీఎస్ ఆగ్రోస్ ఎండీ కె.రాములు ఎన్ రైప్ ను ఆవిష్కరించారు.” చైనా విష రసాయనాలతో మన మామిడి పండ్లు మాగబెట్టడం ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తోందని  సేంద్రియ పద్దతుల్లోనే మామిడి పండ్లను మాగబెట్టాలన్నారు.
చైనా విషరసాయనాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదన్నారు.. అందుకే తెలంగాణ ప్రభుత్వం సేంద్రియ పద్దతుల్లో పండ్లను మాగబెట్టే ఎన్‌ రైప్‌ మిక్చర్‌కు అనుమతి ఇచ్చిందన్నారు.  ఇలాంటి ఎన్‌ రైప్‌ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని మహుమూద్ అలీ అన్నారు. ఎన్‌ రైప్ వంటి సేంద్రియ పద్దతుల్లో మామిడి పండ్లను మాగబెట్టే మిక్చర్‌ తయారు చేయడం దేశంలోనే ఇదే ప్రథమం స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ ప్రవీణ్‌ కుమార్ అన్నారు. ఇలాంటి ఉత్పత్తులను మనం ప్రోత్సహించాలన్నారు. అంతే కాకుండా ఈ ఎన్‌ రైప్‌ మిక్చర్‌ను సేంద్రీయం అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ధ్రువీకరించడం సంతోషదాయకమని ప్రవీణ్ కుమార్ కితాబిచ్చారు.
Venu

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

9 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

9 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

9 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

9 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

9 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago