మనవార్తలు ,శేరిలింగంపల్లి :
గచ్చిబౌలి డి. ఎల్. ఎఫ్ బిల్డింగ్ లోని సైబేజ్ సాఫ్ట్వేర్ కంపెనీ తమ కార్పొరేట్ సామజిక బాధ్యతలో భాగంగా గత సంవత్సరం సైబేజ్ కోవిద్ సంజీవని ప్రోగ్రాం ని ప్రారంభించి కరొనతో కుటుంబంలో ఇంటి పెద్ద చనిపోయి కుటుంబ పోషణ భారంగా ఉన్న కుటుంబాలకి చేయూతని ఇవ్వడం కోసం వారి కుటుంబంలో ఉన్న పిల్లలని చదివించడం కోసం స్కూల్ ఫీజులని మరియు కొంత మంది కుటుంబాలకి 6 నెలలు ఇంటి అద్దెలు, 6 నెలలు కిరాణా సామానులు కూడా అందించడం జరిగిందిoచినట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం రోజు స్కూల్ పిల్లకి స్కూల్ ఫీజు చెక్కులని మరియు స్కూల్ బ్యాగులని హైదరాబాద్ సైబేజ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ డెలివరీ మామూనూరు సురేష్, డెలివరీ హెడ్స్ పుచ్చ శర్మ, రవి శర్మ, సత్యప్రసాద్ లు అందజేశారు..
పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ కష్ట సమయంలో సైబేజ్ కంపెనీ చేసిన సేవలు మరువలేనివని, పిల్లలకి చదువులకోసం చేస్తున్న సహాయం ఎప్పటికి మరువలేదునిది అని ఎప్పుడు సైబేజ్ కంపెనీ కి రుణ పడి ఉంటామని అన్నారు. సైబేజ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మామూనూరు సురేష్ మాట్లాడుతూ పిల్లలు కస్టపడి చదువుకోవాలని, చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పుచ్చశర్మ మాట్లాడుతూ సబ్జెక్టు మీద ఇష్టం తో చదివితే సబ్జెక్టు ఈజీ గా అర్ధం అవుతుందని మంచి మర్క్స్ సాధించొచ్చు అని తెలిపారు. సి. ఎస్. ఆర్ ఎగ్జిక్యూటివ్ అనపురపు సురేష్ మాట్లాడుతూ కష్టాలు అందరికి వస్తాయని వాటిని ఎదుర్కొని నిలపడి పిల్లలని బాగా చదివిస్తే భవిష్యత్ లో వాళ్ళు మంచి ఉద్యోగాలు సాధించి మీ కుటుంబాలకు అండగా ఉంటారని తెలిపారు.
ఇప్పటి వరకు సైబేజ్ కోవిద్ సంజీవని ప్రోగ్రాం ద్వారా హైదరాబాద్ లో 115 స్కూల్స్, కాలేజీ స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ సపోర్ట్ గత సంవత్సరం నుండి చేస్తున్నామని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు సైబేజ్ కి మరియు సైబేజ్ సి.ఈ.ఓ అరుణ్, సి.ఎస్.ఆర్ హెడ్ రీతూ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్. ఆర్ ధనంజయ్, చైతన్య, అనూష,అడ్మిన్ ప్రేమ్, శ్వేతా, కిషోర్ మరియు సాయిరాం, విద్యార్థులు, వారి తల్లులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…