Telangana

కరోనాతో చనిపోయిన కుటుంబాల పిల్లలకి చేయూత – సైబేజ్ సాఫ్ట్ వేర్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ మరియు స్కూల్ బ్యాగ్స్ పంపిణి

మనవార్తలు ,శేరిలింగంపల్లి :

గచ్చిబౌలి డి. ఎల్. ఎఫ్ బిల్డింగ్ లోని సైబేజ్ సాఫ్ట్వేర్ కంపెనీ తమ కార్పొరేట్ సామజిక బాధ్యతలో భాగంగా గత సంవత్సరం సైబేజ్ కోవిద్ సంజీవని ప్రోగ్రాం ని ప్రారంభించి కరొనతో కుటుంబంలో ఇంటి పెద్ద చనిపోయి కుటుంబ పోషణ భారంగా ఉన్న కుటుంబాలకి చేయూతని ఇవ్వడం కోసం వారి కుటుంబంలో ఉన్న పిల్లలని చదివించడం కోసం స్కూల్ ఫీజులని మరియు కొంత మంది కుటుంబాలకి 6 నెలలు ఇంటి అద్దెలు, 6 నెలలు కిరాణా సామానులు కూడా అందించడం జరిగిందిoచినట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం రోజు స్కూల్ పిల్లకి స్కూల్ ఫీజు చెక్కులని మరియు స్కూల్ బ్యాగులని హైదరాబాద్ సైబేజ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ డెలివరీ మామూనూరు సురేష్, డెలివరీ హెడ్స్ పుచ్చ శర్మ, రవి శర్మ, సత్యప్రసాద్ లు అందజేశారు..

పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ కష్ట సమయంలో సైబేజ్ కంపెనీ చేసిన సేవలు మరువలేనివని, పిల్లలకి చదువులకోసం చేస్తున్న సహాయం ఎప్పటికి మరువలేదునిది అని ఎప్పుడు సైబేజ్ కంపెనీ కి రుణ పడి ఉంటామని అన్నారు. సైబేజ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మామూనూరు సురేష్ మాట్లాడుతూ పిల్లలు కస్టపడి చదువుకోవాలని, చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పుచ్చశర్మ మాట్లాడుతూ సబ్జెక్టు మీద ఇష్టం తో చదివితే సబ్జెక్టు ఈజీ గా అర్ధం అవుతుందని మంచి మర్క్స్ సాధించొచ్చు అని తెలిపారు. సి. ఎస్. ఆర్ ఎగ్జిక్యూటివ్ అనపురపు సురేష్ మాట్లాడుతూ కష్టాలు అందరికి వస్తాయని వాటిని ఎదుర్కొని నిలపడి పిల్లలని బాగా చదివిస్తే భవిష్యత్ లో వాళ్ళు మంచి ఉద్యోగాలు సాధించి మీ కుటుంబాలకు అండగా ఉంటారని తెలిపారు.

ఇప్పటి వరకు సైబేజ్ కోవిద్ సంజీవని ప్రోగ్రాం ద్వారా హైదరాబాద్ లో 115 స్కూల్స్, కాలేజీ స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ సపోర్ట్ గత సంవత్సరం నుండి చేస్తున్నామని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు సైబేజ్ కి మరియు సైబేజ్ సి.ఈ.ఓ అరుణ్, సి.ఎస్.ఆర్ హెడ్ రీతూ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్. ఆర్ ధనంజయ్, చైతన్య, అనూష,అడ్మిన్ ప్రేమ్, శ్వేతా, కిషోర్ మరియు సాయిరాం, విద్యార్థులు, వారి తల్లులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago