Telangana

పాటి పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

_ఆందోళన చేపట్టిన ఆనంద్ నగర్ ప్లాట్ ఓనర్స్ సభ్యులు

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

శనివారం పాటి పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాము చట్టబద్ధంగా కొన్న ఫ్లాట్లలో కొంతమంది తమను ఇళ్లు కట్టుకోకుండా అడ్డుకుంటున్నారని, తమకు సహకరించాల్సిన పంచాయతీ యంత్రాంగం బడా బాబులకు వత్తాసు పలుకుతూ తమకు సంబంధించిన రికార్డులేవీ పంచాయతీ కార్యాలయం లో లేవని చెబుతుండటంపై ఆనంద్ నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు శనివారం పాటి పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శని నిలదీశారు. కుటుంబ సభ్యులతో సహా పాటి చేరుకున్న ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు అక్కడ ఆందోళన చేపట్టి అనంతరం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని పంచాయతీ యంత్రాంగాన్ని తీవ్ర స్థాయిలో నిలదీయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. విషయం తెలుసుకున్న పాటి సర్పంచ్ లక్ష్మణ్ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఫ్లాట్ ఓనర్స్ తో మాట్లాడారు.

 

తాను సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పేదలకు అండగా ఉంటున్నానని ఈ విషయంలో కూడా ప్లాట్ ఓనర్స్ అందరికీ తాను తన వంతు సహకారం అందించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇటువంటి చట్టబద్ధమైన విషయాలలో స్థానిక నాయకులను, ఎమ్మెల్యేను బదలాం చేయటం సరైన పద్ధతి కాదన్నారు. 1977లో కొన్న తమ ప్లాట్లను కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకుని తమను బయటకు పంపించాలని చూస్తున్నారని దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నామని, కోర్టు ఆదేశాల ప్రకారం త్వరలోనే తమ ప్లాట్లలో తాము నిర్మాణాలు చేపడతామని ఇందుకు అధికారులు, స్థానిక నాయకులు తమకు సహకరించాలని ఈ సందర్భంగా ప్లాట్ ఓనర్స్ సభ్యులు కోరారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago