Telangana

మనసున్న మహారాజు గూడెం మహిపాల్ అన్న

_రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెరాస

_కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి  అండగా నిలిచారు.ప‌టాన్ చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పెద్దింటి వెంకటేష్ టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్త. ఆరు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేష్ దుర్మరణం పాలయ్యాడు. అంతకుముందే వెంకటేష్ భార్య సైతం మృతి చెందడంతో కుటుంబం అనాధగా మారింది. ఒక కొడుకు, ఇద్దరు కూతుర్ల పోషణ భారంగా మారింది.ఇటీవల వెంకటేష్ కూతురు వివాహం కుదరడంతో, స్థానిక టిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు వారి కుటుంబ పరిస్థితిని ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జీఎంఆర్, రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు.

ఈ మేరకు శనివారం ఉదయం స్థానిక సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే జిఎంఆర్ తనయుడు గూడెం విక్రమ్ రెడ్డిలు వెంకటేష్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించారు. గతంలోనూ టిఆర్ఎస్ పార్టీ అందించిన ప్రమాద బీమా ద్వారా రెండు లక్షల రూపాయలను అందించడం జరిగింది.టిఆర్ఎస్ పార్టీకి వెన్నెముకలైన కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా ఎమ్మెల్యే జిఎంఆర్ అండగా నిలుస్తున్నారని సర్పంచ్ సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు రాజు, హరి ప్రసాద్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, మన్నె రాజు, పంచాయతీ వార్డు సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు సిహెచ్ శంకర్, కంచరి శ్రీనివాస్, గడ్డ ఎల్లయ్య, నాయకోటి నాగరాజు, డి వెంకటేష్ , నాయకోటి సంతోష్ , ప్రభు, వడ్డే అనంతయ్య ,వడ్డే సుధాకర్ , తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago