మనవార్తలు ,నంద్యాల:
నంద్యాల జిల్లా అయిన తర్వాత హెల్త్ మాఫియా పెట్రేగి పోతుందని నంద్యాల సీపీఐ నేతలు అన్నారు . నంద్యాల సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రంగ నాయుడు మాట్లాడుతూ నంద్యాల కార్పోరేట్ ఆసుపత్రులు నిబంధనలకు విరుద్దంగా చికిత్సలు అందిస్తు రోగులను పీల్చిపిప్పిచేస్తున్నారని మండిపడ్డారు .ప్రతి హాస్పటల్ లో ఏ వైద్యంకు ఎంత ఖర్చు అవుతుందో తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు .కార్పోరేట్ ఆసుపత్రులు ఆరోగ్య శ్రీని ఆసరా చేసుకుని పేషంట్లకు అవసరం లేని పరీక్షలు నిర్వహించి వేల వేలు దోచుకుంటున్నారని విమర్శించారు .నంద్యాల డాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని రోగులకు లేని జబ్బులు ఉన్నాయంటూ బ్లడ్ టెస్ట్ లు , ల్యాబ్ టెస్ట్ , యాంజియోగ్రామ్ అంటూ ఇతర టెస్ట్ చేస్తు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు .హెల్త్ మాఫియా ఏర్పడి ప్రజలను దోచుకుంటున్నారని..సీపీఐ పార్టీ దీనిపై పోరాటం చేస్తుందన్నారు . నిబంధనలకు విరుద్దంగా ఆపరేషన్లు చేస్తున్న ఆసుపత్రులను డీఎంఅండ్ హెచ్ఓ అధికారులు సీజ్ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…