ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు వినతి
మనవార్తలు ,పటాన్చెరు
రాష్ట్రంలోని వీరబద్రియ కులస్తుల కోసం ఆత్మగౌరవ భవనం మంజూరు చేయాలని కోరుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో వీరబద్రియ కమిటీ బృందం బుధవారం రాష్ట్ర బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం లోని అన్ని కులాలవారికి ఆత్మగౌరవ భవనం కోసం స్థలం, నిధులు కేటాయిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురువైన వీరబద్రియ సంక్షేమం కోసం కృషి చేయాలని వారు కోరారు.
ఇందుకు మంత్రి గంగుల కమలాకర్ సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకుని వెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చవ్వ పాండు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మల్లేష్, యాదయ్య, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…