ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు వినతి
మనవార్తలు ,పటాన్చెరు
రాష్ట్రంలోని వీరబద్రియ కులస్తుల కోసం ఆత్మగౌరవ భవనం మంజూరు చేయాలని కోరుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో వీరబద్రియ కమిటీ బృందం బుధవారం రాష్ట్ర బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం లోని అన్ని కులాలవారికి ఆత్మగౌరవ భవనం కోసం స్థలం, నిధులు కేటాయిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబాటుకు గురువైన వీరబద్రియ సంక్షేమం కోసం కృషి చేయాలని వారు కోరారు.
ఇందుకు మంత్రి గంగుల కమలాకర్ సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకుని వెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చవ్వ పాండు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మల్లేష్, యాదయ్య, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…