మన వార్తలు, శేరిలింగంపల్లి :
ముదిరాజుల రిజర్వేషన్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ముదిరాజ్ చైతన్య వేదిక డిమాండ్ చేసింది. బిసిసి భవన్ లో ముదిరాజు లకు రాజ్యంగ బద్దంగా రావాల్సిన హక్కుల కోసం”ఆలోచనపరుల మేధోమధనం” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ చైతన్య వేదిక కార్యవర్గ సభ్యులు శివ ముదిరాజ్ మాట్లాడుతూ, ముదిరాజు లు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కలిగిన ఉన్నప్పటికీ విద్య, ఉద్యోగాలలో చట్ట బద్ధంగా రావాల్సిన వాటా కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు అని, ప్రభుత్వం వెంటనే ముదిరాజు లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముదిరాజ్ చైతన్య వేదిక రాష్ట్ర మహిళా నాయకురాలు కోట్ల పుష్పాలత ముదిరాజ్ గారు మాట్లాడుతూ, ముదిరాజు లకు విద్య , ఉద్యోగాలలో జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి ముదిరాజు లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్, కురుమూర్తి, సీత మహాలక్ష్మి, సురేష్, వెంకటేష్, నరసింహ, కూరగాయల వెంకన్న, రవీందర్, మహేష్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…