Hyderabad

సాయి కాలనీ బ్రిడ్జి పనులను పరిశీలించిన గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్:

బీరంగూడ- కిష్టారెడ్డిపేట రహదారి విస్తరణలో భాగంగా శ్రీ కృష్ణుడి గుడి వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పటాన్చెర శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, ఆయా శాఖల అధికారులతో కలిసి బ్రిడ్జి పనుల పురోగతిని పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో మురుగు నీరంతా ఇళ్లలోకి వస్తుందన్న కాలనీవాసుల ఫిర్యాదు మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కాలనీ లో పర్యటించారు.

మురికినీరు కాలనీ లోకి వెళ్లకుండా అత్యవసరంగా నూతన పైప్లైన్ వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చేయాలని సూచించారు. జాతీయ రహదారి కి అమీన్పూర్ మున్సిపాలిటీ కలిపి కీలకమైన బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, హెచ్ఎండిఎ ఈ ఈ అప్పారావు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago