గుమ్మడిదల:
చదువుతోనే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని యండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు అన్నారు. గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 32 ఇంచుల ఎల్ఈడి టీవీని శనివారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులకు యండిఆర్ పౌండేషన్ తరఫున దేవేందర్ రాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ఆన్ లైన్ తరగతులు నడుస్తున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు టీవీని అందజేసినట్లు తెలిపారు. దీనివల్ల పేద విద్యార్థుల చదువులు సజావుగా సాగుతాయన్నారు.
నేటి బాలల భవిష్యత్తుకు వెలుగు చూపే ఆయుధం విద్య అన్నారు. వారందరూ ఉన్నత చదువులు చదివి సుఖవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కడా సామూహిక సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. యండిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో తమ కార్యక్రమాలు మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో గుమ్మడిదల ముదిరాజ్ సంఘము అధ్యక్షుడు గ్యారాల మల్లేష్, ఉపాధ్యక్షుడు యాదగిరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రదీప్ కుమార్, వెంకటేష్, కోశాధికారి వీరేశ్, అనంతారం మాజీ ఉపసర్పంచ్ గోపాల్ చక్రపాణి, తిరుమల, నిర్మల కుమారి, కవిత, నిర్మల, యండిఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…