Hyderabad

చదువుతోనే సమాజ అభివృద్ధి : యండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు

గుమ్మడిదల:

చదువుతోనే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని యండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు అన్నారు. గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 32 ఇంచుల ఎల్ఈడి టీవీని శనివారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులకు యండిఆర్ పౌండేషన్ తరఫున దేవేందర్ రాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ఆన్ లైన్ తరగతులు నడుస్తున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు టీవీని అందజేసినట్లు తెలిపారు. దీనివల్ల పేద విద్యార్థుల చదువులు సజావుగా సాగుతాయన్నారు.

నేటి బాలల భవిష్యత్తుకు వెలుగు చూపే ఆయుధం విద్య అన్నారు. వారందరూ ఉన్నత చదువులు చదివి సుఖవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కడా సామూహిక సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. యండిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో తమ కార్యక్రమాలు మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు.

 

కార్యక్రమంలో గుమ్మడిదల ముదిరాజ్ సంఘము అధ్యక్షుడు గ్యారాల మల్లేష్, ఉపాధ్యక్షుడు యాదగిరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రదీప్ కుమార్, వెంకటేష్, కోశాధికారి వీరేశ్, అనంతారం మాజీ ఉపసర్పంచ్ గోపాల్ చక్రపాణి, తిరుమల, నిర్మల కుమారి, కవిత, నిర్మల, యండిఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago