ఎల్వోసీ అందజేసిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి

Districts politics Telangana

పటాన్చెరు

నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణానికి చెందిన కృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకోగా, 35 వేల రూపాయలు ఎల్వోసీ మంజూరైంది. ఈ మేరకు సోమవారం ఉదయం కృష్ణ కుటుంబ సభ్యులకు గూడెం మధుసూదన్ రెడ్డి ఎల్వోసీ అనుమతి పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్య తరగతి, కార్మిక బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా నివసించే పటాన్చెరు నియోజకవర్గంలో సి ఎం ఆర్ ఎఫ్ పథకం ద్వారా వేలాది మందికి ఆర్థిక సహాయం లభిస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలులో నియోజక వర్గాన్ని ముందంజలో నిలుపుతున్నట్లు గూడెం మధుసూదన్ రెడ్డితెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్రా బిక్షపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *