పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
కార్యాలయాలలో లింగ వ్యత్యాసం పెద్ద సమస్యగా మారిందని , దాని అరికట్టితే తప్ప సృజనాత్మకతను పెంపొందించలేమని , ఆవిష్కరణలను ప్రోత్సహించలేమని , కంపెనీలను అభివృద్ధి పధంలో నడపలేమని ఏజీఎస్ హెల్త్ డెరైక్టర్ నేహా గుప్తా అన్నారు . హైదరాబాద్ లోని గీతం బిజినెస్ స్కూల్ , మానవ వనరుల విభాగం ఆధ్వర్యంలో ‘ ఓ మహిళా నేతకు ఎదురయ్యే సవాళ్లు , అవకాశాలు ‘ అనే అంశంపై గురువారం ఆమె ఆతిథ్య ఉపన్యాసం చేశారు . నాయకత్వ స్థానాలలో మహిళలు అధిక సంఖ్యలో ఉండాలని సంవత్సరాల తరబడి మాట్లాడుతున్నా , ఫార్చ్యూన్ 500 కంపెనీల సీఈవోల జాబితాలో కేవలం ఆరు శాతం కంటే తక్కువగానే మహిళలున్నట్టు నాస్కామ్ గణాంకాలను ఉటంకిస్తూ ఆమె చెప్పారు . పరిశ్రమ వెవిధ్యమైన శ్రామిక శక్తిని గుర్తించినప్పటికీ కేవలం ఒక శాతం కంటే తక్కువగానే అంగవైకల్యం ఉన్న వారు పనిచేస్తున్నారని , ఇక నపుంసకుల సంఖ్య గురించి చెప్పనక్కలేదన్నారు . ఈ నపుంసకులకు ఇటు పని దొరకక , అటు కుటుంబాలు వెలివేస్తున్నాయంటూ ఆమె విచారం వెలిబుచ్చారు . ఈ పరిస్థితిని మార్చేందుకు సమాజంలో మరింత అవగాహన రావాలని , ఆయా సమస్యలపై తరచుగా చర్చించాలని , చైతన్య కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని నేహా గుప్తా పేర్కొన్నారు .
ప్రతి ఒక్కరికీ జీవితంలో సవాళ్లు ఎదురవుతాయని , ఒక్కసారి వాటిని అధిగమిస్తే అపార అవకాశాలు మనముందుంటాయని వర్ధమాన మేనేజర్లకు నేహా గుప్తా సూచించారు . కొత్త ఆలోచనలకు ప్రతిఘటన ఎప్పుడూ ఉంటుందని , దానిని అధిగమించి ముందుకు పోయే చొరవ మనలో ఉండాలని ఆమె స్పష్టీకరించారు . తొలుత , ఈ కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ నాగ రేఖ అతిథిని సత్కరించారు . విద్యార్థి ప్రతినిధులు మానస స్వాగతోపన్యాసం చేయగా , కీర్తన వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది . ప్రశ్నలడిగేలా విద్యార్థులను ప్రోత్సహించి , సందర్భోచితంగా జవాబులిచ్చి నేహా గుప్తా ఆకట్టుకున్నారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…