_సామాజిక సేవలో పారగాన్ సంస్థ సేవలు అభినందనీయం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
సామాజిక సేవలో పారగాన్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ మార్క్స్ నగర్ లో పారగాన్ సంస్థ సౌజన్యంతో 83 లక్షల రూపాయల సి.ఎస్.ఆర్ నిధులతో చేపడుతున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రం నూతన భవనాల నిర్మాణ పనులకు బుధవారం ఎమ్మెల్యే జీఎంఆర్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ లు కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమలు సామాజిక బాధ్యతా కార్యక్రమం ద్వారా అందిస్తున్న నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.పారగాన్ సంస్థ యాజమాన్యం సామాజిక బాధ్యతలో భాగంగా ఇప్పటికే రామచంద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పటాన్చెరులోని ఏరియా ఆసుపత్రిలో లక్షల రూపాయల వ్యయంతో అధునాతన శస్త్ర చికిత్స పరికరాలను అందించిందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్పూర్తితో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు.ఆధునిక వసతులతో పాఠశాల భవనంతో పాటు అంగన్వాడి కేంద్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు..ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మండల విద్యాధికారి జెమినీ కుమారి, పారగాన్ సంస్థ ప్లాంట్ మేనేజర్ శ్రీ జిత్, సీనియర్ హెచ్ఆర్ బిన్ను, బి ఆర్ ఎస్ పార్టీ ఏరియా అధ్యక్షులు గోపాల్, నాయకులు సురెష్ రెడ్డి , ఖలీమ్ , బాగయ్య, చంద్ర శేఖర్, సుశీలమ్మ, చంద్రమ్మ, ధనరాజ్ గౌడ్, పద్మ , రజని , గోరి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…