పటాన్చెరు:
గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ (ఎస్ఓపీ) ని 2021 లో అత్యంత ఆశాజనకమైన, ఉద్భవిస్తున్న ఫార్మశీ కళాశాల విభాగం కింద నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు-2021 తో సత్కరించింది. నాణ్యమైన విద్య, అత్యుత్తమ పాలన, ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాల ఆధారంగా ఈ అవార్డును ప్రదానం చేస్తారని శుక్రవారం విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో కూడా వర్చువల్ విధానంలో సజావుగా తరగతులు నిర్వహించినందుకు గాను వర్చువల్ గా జ్ఞానాన్ని పంచడంలో అత్యుత్తమ పనితీరు విభాగంలో మరొక అవార్డును కూడా ఇచ్చారని, ఇటీవల బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్ అందుకున్నట్టు తెలియజేశారు.
ప్రపంచ ఫార్మశిస్ట్ దినోత్సవం…
భారతీయ ఫార్మశీ పట్టభద్రుల సంఘం (ఐపీజీఏ) తో కలిసి ప్రపంచ ఫార్మశీ దినోత్సవం-2021 ని స్కూల్ ఆఫ్ ఫార్మశీలో జరుపుకున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐపీజీఏ దక్షిణ భారత సమన్వయకర్త పూర్వ డ్రగ్ ఇన్స్పెక్టర్ జి.కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నట్టు తెలిపారు. ప్రొఫెసర్ జీఎస్ కుమార్ స్వాగత వచనాలతో ఆరంభమైన ఈ కార్యక్రమానికి గీతం వీసీ ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ సభాధ్యక్షత వహించారన్నారు.
ఈ కార్యక్రమంలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ కోడర్స్ అధ్యక్షురాలు ఎస్.ఆదిలక్ష్మి, కర్ణాటక ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ రాజేష్ వెంకట్రామన్ ఆతిథ్య ఉపన్యాసాలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ రాకేష్, బారిక్, డాక్టర్ షినాయ్ సుగుణన్ సమన్వయకర్తలుగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు.
మందుల కోసం భాద పడుతూ వ్యక్తి కి 5,000 వేలు ఆర్దిక సాయం ఎన్ఎంఎం యువసేన
నిర్మాణ రంగం సమస్యల పరిష్కారానికి కృషి – టౌన్ ప్లానింగ్ అధికారులు
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…