Telangana

గీతం స్కాలర్ వసుధకు పీహెచ్ఎడీ

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

‘హైదరాబాద్ (తెలంగాణ)లోని ఐటీ సంస్థలలో సంస్థ యొక్క సుస్థిరతపై పర్యావరణ హిత మానవ వనరుల నిర్వహణ (జీహెచ్ఆర్ఎం) అభ్యాసాల ప్రభావం’పై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి కె.వసుధను డాక్టరేట్ వరించింది. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.పార్వతి శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.పర్యావరణ హిత హెచ్ఎర్ఎమ్ సంస్థలలోని మానవ వనరుల నిర్వహణ పద్ధతులలో పర్యావరణ సుస్థిరత సూత్రాల ఏకీకరణ, కార్బన్ ఉనికిని గణనీయంగా తగ్గించడానికి, శక్తివంతమైన, సమర్థమైన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగాన్ని పోత్రహించడానికి కార్యాలయంలో పర్యావరణ బాధ్యత సంస్కృతిని పెంపొందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నారు. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి, ఆర్ధిక-సామాజిక, పర్యావరణ అభివృద్ధికి దోహదపడే విశ్వ ప్రయత్నాలకు అనుగుణంగా ఐటీ సంస్థలలో పర్యావరణ హిత హెచ్ఎర్ఎం పద్ధతులను అనులు చేయడం ద్వారా చేకూరే సానుకూల ప్రభావాన్ని వసుధ పరిశోధన స్పష్టీకరించిందని ఆమె వివరించారు.వసుధ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ఎడీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీసిసిఎస్ఆర్ వర్మ, పలు విభాగాల ఆధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago