పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంబరాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా మహిళా నాయకురాలు గడ్డ పుణ్యవతి అధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పటాన్ చెరు మాజీ జడ్పీటిసి బిఅర్ఎస్ నేత గడీల శ్రీకాంత్ గౌడ్ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి మరియు పాల్గొన్న మహిళలకు బహుమతులను అందజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ బోగీ, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలిపారు .భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలను తెలుగు సంస్కృతిని ప్రతిపాదించడమే పండుగలు ముఖ్య ఉద్దేశం అని ఇటువంటి పండుగల యొక్క గొప్పతనాన్ని సాంప్రదాయాన్ని మరవకూడదని నేటి తరానికి కూడా సంక్రాంతి పండుగ ముఖ్య ఉద్దేశం తెలియజేయడానికి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాలను నిర్వహించమని , మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ముగ్గుల పోటీలు అని తెలిపారు .ఈ కార్యక్రమంలో పటాన్ చెరు వైస్ ఎంపీపీ స్వప్న,బిజేపి రాష్ట్ర నాయకులు దేవేందర్ గౌడ్ , మాజీ ఎంపీటీసీ గడ్డి యాదయ్య , మరియు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…