పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ,హైదరాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి చిద్విలాస్ కూరపాటిని. డాక్టరేట్ వరించింది. ‘క్రోమోన్ డెరివేటివ్ ల సంశ్లేషణ: భవిష్య క్యాన్సర్ నిరోధక కీమోథెరఫీ పద్ధతి అభివృద్ధి, జీవ మూల్యాంకనం’ అనే అంశంపై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ జి.రాంబాబు శనివారం విడుదల చేసిన ప్రకటనలో’ ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ పరిశోధనలో, జీవశాస్త్రపరంగా చురుకైన సహజ ఉత్పత్తి అయిన పొంగరోటిన్ ఉత్పత్తికి నూతన సింథటిక్ మార్గాన్ని కనుగొనడమే గాక స్పిరో-క్రోమోన్ హైడ్రాక్సిమిక్ యాసిడ్ డెరివేటివ్ లను రూపొందించి, సంశ్లేషణ చేసినట్టు తెలిపారు. హెచ్ డీఏసీ-6, 8 ఎంజైమ్ లకు వ్యతిరేకంగా వాటి జీవసంబంధ కార్యకలాపాలను విశ్లేషించారన్నారు. నానోమోబార్ సాంద్రతలలో ఈ ఎంజైమ్ లపై గణనీయమైన నిరోధక ప్రభావాలను ప్రదర్శించే మూడు సమ్మేళనాల ఆవిష్కరణకు దారితీసినట్టు తెలియజేశారు. చిద్విలాస్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ సబ్బాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, గీతం రెసిడెంట్ డైరక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోతహర్ రెజు, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఎస్ఐఆర్లో పాల్గొనండి.. పటాన్చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…
బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…
రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్కు…
మనవార్తలు ప్రతినిధి, సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…