_ఉపన్యసించనున్న గౌతం వాసుదేవ్ మీనన్, శిల్పారెడ్డి, సజ్జాద్ షాహిద్ తదితరులు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
టెడ్క్స్ గీతం హెదరాబాద్ కార్యక్రమ నిర్వహణకు గీతం హెదరాబాద్ ప్రాంగణం సిద్ధమవుతోంది. ‘రివెండ్ ది మిలీనియం’ ఇతివృత్తంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యువతకు స్ఫూర్తినిచ్చే అంతర్దృష్టి ఆలోచనలను ఒకచోట చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు విశ్వవిద్యాలయ వర్గాలు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. | ప్రఖ్యాత భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు గౌతం వాసుదేవ్ మీనన్: ఫ్యాషన్ డిజెనర్, సన్కార్డ్ వ్యవస్థాపకురాలు, ఏకమ్ లెర్నింగ్ సెంటర్ సహ వ్యవస్థాపకురాలు శిల్పా రెడ్డి; ప్రసిద్ధ చిత్రకారుడు సజ్జాద్ షాహిద్; స్కిప్పి ఐస్ పాన్స్ వ్యవస్థాపక జంట రవి – అనుజా కబ్రా; తెలుగు-ఆంగ్ల పాటల రచయిత, ఇండీ సంగీత.కళాకారుడు నితీష్ కొండపర్తి; ప్రముఖ భరతనాట్య నృత్యకారిణి సనిత శాస్త్రి తదితరులు టెడ్ ఉపన్యాసాలు చేయనున్నారు.ఆలోచనలను ప్రేరేపించే కేంద్రీకృత చర్చలు, విస్తృత శ్రేణి విషయాలపై లోతైన అవగాహన కోసం దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు తమ పేర్లు నమోదు, రుసుము తదితర వివరాల కోసం రెడ్డి (8790408465) లేదా లోకేష్ (9394843115)ని సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…