Telangana

విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థానం సంపాదించుకోవాలి తహసీల్దార్ రాజయ్య

సంగారెడ్డి,మనవార్తలు ప్రతినిధి :

గురుకుల పాఠశాల విద్యార్థులు కార్పోరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అత్యుత్తమ జీపీఏలతో ఉత్తమ ఫలితాలు సాధించాలని పుల్కల్ మండల తహసీల్దార్ రాజయ్య అన్నారు . సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్థానిక తహసీల్దార్ రాజయ్య చేతుల మీదుగా బస్వాపూర్ ఎర్రగోల్ల చంద్రశేఖర్, ప్రవీణ్, సాయి రాజ్ పరీక్ష ప్యాడ్ అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోవు వార్షిక పరీక్షల్లో విధ్యార్థులు అత్యుత్తమ జిపిఎలతో ఉత్తమ ఫలితాలు సాదించాలని ఆకాంక్షించారు . ఉన్నత విద్య ద్వారానే ఉత్తమమైన జీవితాలు లభిస్తాయని, చదువులపై శ్రద్ధ వహించాలన్నారు . పరీక్షలకు భయపడకుండా ఉపాధ్యాయలు చెప్పిన పాఠాలను రివిజన్ చేసుకుంటూ .అత్యుత్తమ జి.పి.ఎ లను లక్ష్యంగా చేసుకోవాలన్నారు . ఉపాధ్యాయులు సైతం విధ్యార్థుల్లో మరింతి స్పూర్తి కలిగించి ప్రోత్సహించాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కార్పోరేట్ విద్య సంస్థలతో పోటీగా విద్యను అందించేందుకు అడుగులు వేస్తుందన్నారు .మన ఊరు-మన బడి లాంటి కార్యక్రమాలతో ప్రభుత్వ బడుల్లో మౌళిక సదుపాయాల కల్పన , ఆటా పాటలతో కూడిన విద్యను అందించేందుకు ప్రయత్నిస్తుందన్నారు .పరీక్షల్లో పాస్ , ఫెయిల్ అనేవి సాధారణమని తహసీల్దార్ రాజయ్య అన్నారు .విద్యార్థులు మంచిగా చదువుకున్న ఉన్నత స్థానం సంపాదించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పదవ తరగతి చదవని సమాజంలో మంచి స్థితిలో ఉన్నారని వారు తెలిపారు. అనంతరం తహసీల్దార్ రాజయ్య ,చంద్రశేఖర్ ,ప్రవీణ్, సాయి రాజ్ లను ఉపాద్యాయ బృందం శాలువాలతో  సత్కరించారు . ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ జీవితంలో మంచి స్థాయికి రావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ రాజయ్య ,ఎర్రగొల్ల చంద్రశేఖర్, సాయి రాజ్ ,ప్రవీణ్ ఉపాధ్యాయలు మల్లిఖార్జున్, ఉదయ్ కుమార్ ,జెలిల్ కృష్ణ శ్రీపాద్ ,చెన్నయ్య ,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago