– పాల్గొన్న బ్రిటన్ , అమెరికా విశ్వవిద్యాలయాలు
– వివరాలు సేకరించిన విద్యార్థులు
మనవార్తలు ,పటాన్ చెరు:
హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కెరియర్ గెడైన్స్ సెంటర్ ( జీసీజీసీ ) ఆధ్వర్యంలో ‘ యూకే అండ్ యూఎస్ఏ ఎడ్యుకేషన్ ఫెయిర్’ని నిర్వహించినట్టు జీసీజీసీ డెరైక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . డెన్హమిక్ వరల్డ్ ఎడ్యుకాట్ కమ్యూనిటీ ( డీడబ్ల్యూసీ ) , గీతమ్ ని అదర్ కెరీర్ ఆప్షన్స్ ( ఓసీవో ) ల సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు . గీతం విద్యార్థులు , వారి తల్లిదండ్రుల అభిరుచులకు అనుగుణంగా ఆయా విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో వ్యక్తిగతంగా సంభాషించడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ , ఉపకార వేతనాలు , కోర్సులు , వసతి సౌకర్యం , ఇతర విలువ ఆధారిత ప్రయోజనాలను కూడా అడిగి తెలుసుకున్నట్టు ఆయన వివరించారు . తొలుత , విదేశీ వర్సిటీల ప్రతినిధులు గీతం ఉన్నతాధికారులతో , ఆ తరువాత విద్యార్థులతో ముఖాముఖి సంభాషించి , ఒకరిని మరొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించినట్టు వేణుకుమార్ తెలిపారు . ఓసీవో డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ రవికాంత్ స్వాగతోపన్యాసం చేయగా , నరేష్ గుండోజు వందన సమర్పణతో ముఖాముఖి ముగిసిందన్నారు .
ఆ తరువాత ఫెయిర్ను గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించినట్టు తెలిపారు . యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా , సదరన్ కాలిఫోర్నియా , ఇల్లినాయిస్ ( చికాగో – స్ప్రింగ్ఫీల్డ్ ) డేటన్ , మసాచుసెట్స్ , డూండీ , స్ట్రాల్రెడ్ , యార్క్ నాటింగ్హామ్ వర్సిటీలతో పాటు న్యూ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజెన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ పాల్గొన్నట్టు డాక్టర్ వేణుకుమార్ వివరించారు .
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…