Telangana

గీతమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్…

– పాల్గొన్న బ్రిటన్ , అమెరికా విశ్వవిద్యాలయాలు

– వివరాలు సేకరించిన విద్యార్థులు

మనవార్తలు ,పటాన్ చెరు:

హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కెరియర్ గెడైన్స్ సెంటర్ ( జీసీజీసీ ) ఆధ్వర్యంలో ‘ యూకే అండ్ యూఎస్ఏ ఎడ్యుకేషన్ ఫెయిర్’ని నిర్వహించినట్టు జీసీజీసీ డెరైక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . డెన్హమిక్ వరల్డ్ ఎడ్యుకాట్ కమ్యూనిటీ ( డీడబ్ల్యూసీ ) , గీతమ్ ని అదర్ కెరీర్ ఆప్షన్స్ ( ఓసీవో ) ల సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు . గీతం విద్యార్థులు , వారి తల్లిదండ్రుల అభిరుచులకు అనుగుణంగా ఆయా విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో వ్యక్తిగతంగా సంభాషించడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ , ఉపకార వేతనాలు , కోర్సులు , వసతి సౌకర్యం , ఇతర విలువ ఆధారిత ప్రయోజనాలను కూడా అడిగి తెలుసుకున్నట్టు ఆయన వివరించారు . తొలుత , విదేశీ వర్సిటీల ప్రతినిధులు గీతం ఉన్నతాధికారులతో , ఆ తరువాత విద్యార్థులతో ముఖాముఖి సంభాషించి , ఒకరిని మరొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించినట్టు వేణుకుమార్ తెలిపారు . ఓసీవో డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ రవికాంత్ స్వాగతోపన్యాసం చేయగా , నరేష్ గుండోజు వందన సమర్పణతో ముఖాముఖి ముగిసిందన్నారు .

ఆ తరువాత ఫెయిర్ను గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించినట్టు తెలిపారు . యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా , సదరన్ కాలిఫోర్నియా , ఇల్లినాయిస్ ( చికాగో – స్ప్రింగ్ఫీల్డ్ ) డేటన్ , మసాచుసెట్స్ , డూండీ , స్ట్రాల్రెడ్ , యార్క్ నాటింగ్హామ్ వర్సిటీలతో పాటు న్యూ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజెన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ పాల్గొన్నట్టు డాక్టర్ వేణుకుమార్ వివరించారు .

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

15 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

16 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago