మనవార్తలు ,పటాన్ చెరు:
పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు ఎంతో మేలు చేస్తాయని పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు . మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్లాస్టిక్, రసాయన వినియోగాన్ని తగ్గంచాల్సిన అవసం ఉందన్నారు . ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిల్ల్లుతోందని … ఇలాంటి పరిస్థితుల్లో మట్టి గణపతులను పూజించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించినట్లవుతుందని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు .
మరోవైపు మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు మెట్రోరైల్ విస్తరించాలనే డిమాండ్ తో ఏర్పాటు చేయబడ్డ సాధన సమితి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు . పర్యావరణ పరిరక్షకోసం ప్రజలను చైతన్యం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. వినాయకుని ఆశీస్సులతో మెట్రో సాధన కోసం ప్రతీ ఒక్కరం కృషి చేయాలని విగ్రహాల సంఖ్య పెరిగినట్టుగానే ప్రజల్లో ఐక్యమత్యం పెరగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు . ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ అన్వర్ పటేల్, పాపరాజు, మహెష్ తదితరులు పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…