– పాల్గొన్న బ్రిటన్ , అమెరికా విశ్వవిద్యాలయాలు
– వివరాలు సేకరించిన విద్యార్థులు
మనవార్తలు ,పటాన్ చెరు:
హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కెరియర్ గెడైన్స్ సెంటర్ ( జీసీజీసీ ) ఆధ్వర్యంలో ‘ యూకే అండ్ యూఎస్ఏ ఎడ్యుకేషన్ ఫెయిర్’ని నిర్వహించినట్టు జీసీజీసీ డెరైక్టర్ డాక్టర్ నాతి వేణుకుమార్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . డెన్హమిక్ వరల్డ్ ఎడ్యుకాట్ కమ్యూనిటీ ( డీడబ్ల్యూసీ ) , గీతమ్ ని అదర్ కెరీర్ ఆప్షన్స్ ( ఓసీవో ) ల సౌజన్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు . గీతం విద్యార్థులు , వారి తల్లిదండ్రుల అభిరుచులకు అనుగుణంగా ఆయా విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో వ్యక్తిగతంగా సంభాషించడంతో పాటు దరఖాస్తు ప్రక్రియ , ఉపకార వేతనాలు , కోర్సులు , వసతి సౌకర్యం , ఇతర విలువ ఆధారిత ప్రయోజనాలను కూడా అడిగి తెలుసుకున్నట్టు ఆయన వివరించారు . తొలుత , విదేశీ వర్సిటీల ప్రతినిధులు గీతం ఉన్నతాధికారులతో , ఆ తరువాత విద్యార్థులతో ముఖాముఖి సంభాషించి , ఒకరిని మరొకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించినట్టు వేణుకుమార్ తెలిపారు . ఓసీవో డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ రవికాంత్ స్వాగతోపన్యాసం చేయగా , నరేష్ గుండోజు వందన సమర్పణతో ముఖాముఖి ముగిసిందన్నారు .
ఆ తరువాత ఫెయిర్ను గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించినట్టు తెలిపారు . యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా , సదరన్ కాలిఫోర్నియా , ఇల్లినాయిస్ ( చికాగో – స్ప్రింగ్ఫీల్డ్ ) డేటన్ , మసాచుసెట్స్ , డూండీ , స్ట్రాల్రెడ్ , యార్క్ నాటింగ్హామ్ వర్సిటీలతో పాటు న్యూ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజెన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ పాల్గొన్నట్టు డాక్టర్ వేణుకుమార్ వివరించారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…