Telangana

గణతంత్ర దినోత్సవ పెరేడ్ లో కళా నైపుణ్యాన్ని ప్రదర్శించిన గీతం విద్యార్థిని

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ ఎస్ ) లోని విజువల్ కమ్యూనికేషన్స్ బీఏ తృతీయ సంవత్సరం విద్యార్థిని భావరాజు నందిని న్యూఢిల్లీలో జనవరి 26న నిర్వహించిన 75వ జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకల సాంస్కృతిక ప్రదర్శనలో తన ప్రతిభ చాటారు. ఈ విషయాన్ని ఆమె అధ్యాపకురాలు సంధ్యా గాండే శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దేశ, విదేశాల నుంచి తరలి వచ్చిన అతిథులు, పలువురు రాయబారులు, పౌర, సైనిక ఉన్నతాధికారుల సమక్షంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలలో గీతం విద్యార్థిని పాల్గొని, తన కళా నెపుణ్యాన్ని ప్రదర్శించడం ఓ మరుపురాని అనుభూతిగా ఆమె అభివర్ణించారు. ఆమె కళాభినయానికి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందాయని, ఇది గీతమ్ లో పెంపొందించిన సాంస్కృతిక చైతన్యం. కళాత్మక నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోందన్నారు.  ప్రతిష్టాత్మక గణతంత్ర వేడుకలలో ఎన్ సీసీ కేడటగా కళాభినయాన్ని ప్రదర్శించే అనకాశం అందుకున్న భావరాజు నందినిని గీతం,హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, జీఎస్ హెచ్ ఎస్ డైరక్టర్ సన్నీ గోస్మాన్ జోస్, పలువురు విభాగాధిపతులు, ఆధ్యాపకులు, తోటి విద్యార్థులు అభినందించినట్టు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక సాంస్కృతిక కార్యక్రమానికి నందినిని సిద్ధం చేయడంలో తనవంతు సహకారం అందించినట్టు అధ్యాపకురాలు సంధ్యా గాండే ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

 

 

admin

Recent Posts

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

7 minutes ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

1 day ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

1 day ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago

లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు…

3 days ago