మనవార్తలు ,పటాన్ చెరు:
పాడెపోయిన ఫొటోలను పునరుద్ధరించడానికి వివిధ రకాల అభ్యాస పద్ధతులు అనే అంశంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.ప్రవీణ్ కుమారు డాక్టరేట్ వరించింది . లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సి.వెంకట నరసింహులు , జేఎన్టీయూ కాకినాడ పూర్వ ప్రొఫెసర్ డాక్టర్ కె.శివప్రసాద్ లు ఈ పరిశోధనను పర్యవేక్షించినట్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . ఈ పరిశోధనలో , క్షీణించిన చిత్రాలను సమర్థవంతంగా పునరుద్ధరించడానికి వివిధ రకాల వేవెట్లు , లోతెన అభ్యాస పద్ధతులతో వివిధ అల్గారిథమ్లు అమలు చేసినట్టు తెలియజేశారు . తద్వారా అనుమానిత వ్యక్తిని కనుగొనడం , రోగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఉపకరిస్తుందన్నారు . ఈ పరిశోధనలో భాగంగా 14 పరిశోధనా పత్రాలను ప్రచురించినట్టు తెలిపారు . ప్రవీణ్ కుమార్ సమర్పించిన సిద్ధాంత వ్యాసం కాకినాడలోని ప్రతిష్ఠాత్మక జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య , ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…
మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : రాయదుర్గం, దర్గా, మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎ. భరత్ కుమార్ గౌడ్ గచ్చిబౌలి డివిజన్…
మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : ఎన్ఎంజి చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు హఫీజ్ పేట్ డివిజన్ యువనాయకుడు నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్…
– చట్టపరంగా ధీటుగా ఎదుర్కొంటాo - బీఆర్ఎస్! మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : తమ పై ఎన్ని కేసులు పెట్టి…
భద్రతే మొదటి ప్రాధాన్యం అవగాహన – భాగస్వామ్యం – సాధికారత”తో ఉద్యోగుల్లో భద్రతా చైతన్యం పెంపు ప్రతి పనిదినం భద్రతతోనే…