Telangana

పరిశుభ్రతలో ఉత్సాహంగా పాల్గొన్న గీతం విద్యార్థులు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

మనదేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాద్” దేశవ్యాప్త సరిశుభ్రత కార్యక్రమంలో ఆదివారం హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. గీతమ్లోని ఎన్ఎసీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, హౌస్ కీపింగ్ సిబ్బంది సహకారంతో అక్టోబర్ 15, ఉదయం 10-11 గంటల వరకు విశ్వవిద్యాలయ పరిసరాలతో పాటు రుద్రారంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణాన్ని కూడా శుభ్రపరిచారు.

మహాత్మాగాంధీ జయంతికి ఒకరోజు ముందు, ఆయనకు నివాళులర్పించే లక్ష్యంతో, స్వచ్చత కోసంఅన్నివర్గాల పౌరులు స్వచ్చందంగా కృషిచేయాలని ప్రధాని ఇచ్చిన పిలుపుమేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, గ్రామ సర్పంచ్ పి.సుధీర్రెడ్డి, ఉపసర్పంచ్ యాదయ్య, పంచాయతీ కార్యదర్శి రాణికుమార్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, ఎంపీ హరిశంకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ఎన్సీసీ ఆఫీసర్ శంకర్, పాఠశాలలోని ఎసీసీసీ క్యాడెట్లు చురుగ్గా పాల్గొన్నారు.

 

ఈ సమష్టి కృషి ద్వారా, పరిశుభ్రత ప్రాముఖ్యతను నొక్కి చెప్పడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణాన్ని. నిర్వహించడం పట్ల ప్రతి వ్యక్తిలో బాధ్యతాయుత ఛానాన్ని కలిగించడాన్ని గీతం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో పాల్గొన్న వారంతా పరిశుభ్రత కోసం తమ ప్రయత్నాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago