మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి బ్రిటన్లోని నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం సౌజన్యంతో నాలుగేళ్ళ బీఎస్సీ ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును నిర్వహించనున్నారు . ఈమేరకు నాటింగ్హాహామ్ వర్సిటీకి చెందిన భాగస్వామ్య సంబంధాలు , ప్రాజెక్టుల విభాగాధిపతి అన్నే యిమెంగ్ ఆన్తో బుధవారం ప్రాథమిక చర్చలు జరిగాయి . ఈ కోర్సులో చేరిన విద్యార్థులు రెండేళ్ళ పాటు గీతమ్ , ఆ తరువాత బ్రిటన్లో విద్యాభ్యాసం చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని సంకల్పించారు . ముందుగా , పాఠ్యాంశాలను ఖరారు చేయాలని , రెండు సంస్థల ప్రమాణాలకు సరిపోయేలా బ్రిడ్జ్ కోర్సును రూపొందించి , , అపెన ఒక అవగాహనా ఒప్పందాన్ని ( ఎంవోయూ ) కుదుర్చుకోవాలని నిర్ణయించారు .
అంతే కాకుండా , ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనా కార్యకలాపాలలో కూడా తగిన సహాయ సహకారాలు అందజేసుకోవాలనే ఆసక్తిని ఉభయ పక్షాలూ కనబరిచాయి . గీతం స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష నేతృత్వంలోని ఫుడ్ సెన్స్డ్ అధ్యాపకులు ప్రొఫెసర్ ఉమా మహేశ్వరి , డాక్టర్ అజయ్ కుమార్ స్వర్ణాకర్ , మౌమితా దేవ్ , జి . నిహారిక , పరుల్ థాపర్లు ఈ ప్రాథమిక చర్చలు నిర్వహించారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ప్రొఫెసర్ పి.త్రినాథరావు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు . కాగా , ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయంతో కలిసి గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ సంయుక్తంగా బీఎస్సీ ( బ్లెండెడ్ ) కోర్సును 2019 నుంచి నిర్వహిస్తున్న విషయం విదితమే .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…