మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి బ్రిటన్లోని నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం సౌజన్యంతో నాలుగేళ్ళ బీఎస్సీ ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును నిర్వహించనున్నారు . ఈమేరకు నాటింగ్హాహామ్ వర్సిటీకి చెందిన భాగస్వామ్య సంబంధాలు , ప్రాజెక్టుల విభాగాధిపతి అన్నే యిమెంగ్ ఆన్తో బుధవారం ప్రాథమిక చర్చలు జరిగాయి . ఈ కోర్సులో చేరిన విద్యార్థులు రెండేళ్ళ పాటు గీతమ్ , ఆ తరువాత బ్రిటన్లో విద్యాభ్యాసం చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని సంకల్పించారు . ముందుగా , పాఠ్యాంశాలను ఖరారు చేయాలని , రెండు సంస్థల ప్రమాణాలకు సరిపోయేలా బ్రిడ్జ్ కోర్సును రూపొందించి , , అపెన ఒక అవగాహనా ఒప్పందాన్ని ( ఎంవోయూ ) కుదుర్చుకోవాలని నిర్ణయించారు .
అంతే కాకుండా , ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధనా కార్యకలాపాలలో కూడా తగిన సహాయ సహకారాలు అందజేసుకోవాలనే ఆసక్తిని ఉభయ పక్షాలూ కనబరిచాయి . గీతం స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష నేతృత్వంలోని ఫుడ్ సెన్స్డ్ అధ్యాపకులు ప్రొఫెసర్ ఉమా మహేశ్వరి , డాక్టర్ అజయ్ కుమార్ స్వర్ణాకర్ , మౌమితా దేవ్ , జి . నిహారిక , పరుల్ థాపర్లు ఈ ప్రాథమిక చర్చలు నిర్వహించారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ప్రొఫెసర్ పి.త్రినాథరావు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు . కాగా , ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయంతో కలిసి గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ సంయుక్తంగా బీఎస్సీ ( బ్లెండెడ్ ) కోర్సును 2019 నుంచి నిర్వహిస్తున్న విషయం విదితమే .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…