Telangana

త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే జిఎంఆర్

_నేటి నుండి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు విడుదల

_ఉత్తమ మండలం గా ఎంపిక కావడం పట్ల అభినందనలు

మనవార్తలు ,పటాన్ చెరు:

ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పటాన్చెరు మండలాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. పటాన్చెరు మండల పరిషత్ అధ్యక్షురాలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు నీటి నుండి అన్ని గ్రామ పంచాయతీలకు విడుదల అవుతున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ఉత్తమ మండలం గా పటాన్చెరు ఎంపికై అవార్డు తీసుకోవడం పట్ల ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో అన్ని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వం అందించే నిధులపాటు సిఎస్ఆర్ నిధులు ద్వారా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

మన ఊరు మనబడి పథకం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో చేపడుతున్న పనులను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.ఈ సందర్భంగా ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గడిల కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, ఎమ్మార్వో మహిపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago