Telangana

గీతం ఆర్కిటెక్చర్ విద్యార్థుల విద్యా అధ్యయన పర్యటన

ఆగ్రా, జైపూర్, జైసల్మేర్, జోధ్ పూర్, ఢిల్లీలను సందర్శించి, మనదేశ నిర్మాణ వారసత్వ పరిశీలన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మూడవ ఏడాది విద్యార్థులు రెండు వారాల పాటు ఉత్తర భారతదేశంలో విద్యా అధ్యయన పర్యటనను చేశారు హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంగణాల ఆర్కిటెక్చర్ విద్యార్థులు తమ అధ్యాపకులతో కలిసి ఆగ్రా, జైపూర్, జైసల్మేర్, జోధ్ పూర్, ఢిల్లీ వంటి చారిత్రాత్మక నగరాలను పర్యటించి, భారతదేశ గొప్ప నిర్మాణ వారసత్వాన్ని లోతుగా పరిశీలించారు. ఈ విషయాన్ని ఆర్కిటెక్చర్ స్కూల్ డైరెక్టర్ బందన్ కుమార్ మిశ్రా మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.జాగ్రత్తగా రూపొందించిన ఈ పర్యటన విద్యార్థులకు మొఘల్ వైభవం నుంచి రాజపుత్ క్లిష్టత, సమకాలీన ఆవిష్కరణల వరకు విభిన్న శ్రేణి నిర్మాణ శైలులను అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించింది.

ఈ పర్యటనలో ముఖ్యమైన అంశం, జైపూర్ లోని అయోజన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో విద్యా మార్పిడి. అక్కడి విద్యార్థులతో ఆలోచనలను రేకెత్తించే చర్చలు, సహకార అభ్యాసంలో పాల్గొని, అంతర్-సంస్థాగత జ్జాన భాగస్వామ్యాన్ని పెంపొందించుకున్నారు.ఆ తరువాత, జైసల్మేర్ లోని రాజకుమారి రత్నవతి బాలికల పాఠశాల సందర్శన అద్భుతమైన అనుభవాలలో ఒకటి. ఇది స్థిరమైన నిర్మాణ శైలికి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ. స్థానిక బాలికలను విద్య ద్వారా శక్తివంతం చేయడానికి రూపొందించబడిన ఈ సంస్థ, పర్యావరణ స్పృహతో కూడిన డిజైన్ యొక్క పరివర్తన ప్రభావాన్ని చూపడమే గాక, సామాజిక మార్పును నడిపించడంలో వాస్తు శిల్పం పాత్రను విశదీకరిస్తోంది.తరగతి గది అభ్యాసానికి మించి, ఈ అధ్యయన పర్యటన విద్యార్థులకు సాంప్రదాయ, ఆధునిక నిర్మాణ పద్ధతులపై సమగ్ర దృక్పథాన్ని అందించింది.

సమకాలీన అనువర్తనాలతో చారిత్మక అంతర్దృష్టులను అనుసంధా నించడం ద్వారా, ఈ ప్రయాణం వారి విద్యా కార్యకలాపాలను సుసంపన్నం చేసింది. సంస్కృతి, సమాజాలపై వాస్తుశిల్పం యొక్క లోతైన ప్రభావం పట్ల వారిలో ఆలోచనలను రేకెత్తించింది.ఈ స్వీయ పరిశీలానుభవం గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ యొక్క ఆచరణాత్మక అభ్యాసం, విశ్వశ్రేణి అవగాహనలపై దాని నిబద్ధతను చాటి చెబుతోంది. జ్జాన దృష్టితో భవిష్యత్తును రూపొందించే, ముందు చూపుతో యోచించే వాస్తుశిల్పులుగా మారడానికి విద్యార్థులను సిద్ధం చేస్తోంది.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

17 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago