పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు మండలం పాటి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. బుధవారం రాత్రి పాటి గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద నెలకొల్పిన గణేష్ లడ్డు వేలంపాట కొనసాగింది. ఈ యొక్క వేలంపాటలో పాటి గ్రామ సర్పంచ్ మున్నూరు లక్ష్మణ్ రూ.11 లక్షల 1 రూపాయికి కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మున్నూరు లక్ష్మణ్ మాట్లాడుతూ… పాటి గ్రామంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే గ్రామస్తులు అందరం కలిసి గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నామని అన్నారు. కులమతాలకు అతీతంగా గణేష్ ఉత్సవాలతో పాటు ప్రతి పండుగలను గ్రామస్తులందరం కలిసిమెలిసి జరుపుకుంటున్నట్లు తెలిపారు. వినాయకుడి కృపతో గ్రామస్తులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది ఎప్పుడూ డిమాండ్ బిజినెస్. అందుకే ఆహారంలో…
“కాళేశ్వరం నిజం బయటపడింది బీఆర్ఎస్ ఆరోపణలకు న్యాయబలం” “రైతులను మోసం చేసింది ఎవరు _ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజల…
పరిశోధనాంశాలను వివరించిన సైకాలజీ అధ్యాపకురాలు డాక్టర్ అఫ్రిన్ వసీం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మహిళలు భయం లేకుండా…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : ఆర్టీసీ కార్మికుల తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్సీయూ డిపో మరియు మియాపూర్…
గీతం కార్యశాలలో కార్పొరేట్ శిక్షకురాలు జూజర్ (జె) సూచన మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రభావవంతమైన కథనం భావోద్వేగపరంగా…
తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ అంశాలకు ప్రథమ ప్రాధాన్యత నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించవద్దు ప్రజల…