Telangana

భవిష్యత్తు భారత్..

– స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో గీతం ప్రోవీసీ ఉద్ఘాటన

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

మనదేశం క్రమాభివృద్ధి సాధిస్తూ త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగాఆవిర్భవించనుందని గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు ఉద్ఘాటించారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతం ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద మంగళవారం ఆయన మువ్వన్నెల జెండాను ఎగురవేసి, వందనం చేశారు. ఎన్ఎస్సీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో పాటు భద్రతా సిబ్బంది కవాతు తరువాత ఆయన గీతం అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.1990 ఆర్థిక సంస్కరణల అనంతరం మనదేశం ఓ మలుపు తీసుకుందని, ఆత్మవిశ్వాసంతో, స్వతంత్రంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం మూడో స్థానానికి త్వరలోనే చేరబోతున్నట్టు సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు.

వచ్చే 25 నుంచి 30 ఏళ్లలో మనం స్వయంగా రూపకల్పన చేసిన వస్తువులను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని, అందులో విద్యా సంస్థల పాత్ర ఉందని, జ్ఞానాన్ని, మేథో సంపత్తిని వృద్ధిచేయడంలో అవి కీలకపాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు. ప్రపంచం మెచ్చే మేటి వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా అది సాధించగలమన్నారు. ఒక దేశంగా భారత్ ఇతర ప్రపంచానికి అందించగల సాంకేతిక/యాజమాన్య పరిజ్ఞానాలలో అగ్రగామిగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ప్రొఫెసర్ డీఎస్ వు వెలిబుచ్చారు.చివరిగా, కళాకృతి బృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలు అల్పాహార విందుతో ముగిశాయి.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

4 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

4 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago