Telangana

భవిష్యత్తు భారత్..

– స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో గీతం ప్రోవీసీ ఉద్ఘాటన

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

మనదేశం క్రమాభివృద్ధి సాధిస్తూ త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగాఆవిర్భవించనుందని గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు ఉద్ఘాటించారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గీతం ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద మంగళవారం ఆయన మువ్వన్నెల జెండాను ఎగురవేసి, వందనం చేశారు. ఎన్ఎస్సీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో పాటు భద్రతా సిబ్బంది కవాతు తరువాత ఆయన గీతం అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.1990 ఆర్థిక సంస్కరణల అనంతరం మనదేశం ఓ మలుపు తీసుకుందని, ఆత్మవిశ్వాసంతో, స్వతంత్రంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం మూడో స్థానానికి త్వరలోనే చేరబోతున్నట్టు సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు.

వచ్చే 25 నుంచి 30 ఏళ్లలో మనం స్వయంగా రూపకల్పన చేసిన వస్తువులను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని, అందులో విద్యా సంస్థల పాత్ర ఉందని, జ్ఞానాన్ని, మేథో సంపత్తిని వృద్ధిచేయడంలో అవి కీలకపాత్ర పోషిస్తాయని ఆయన చెప్పారు. ప్రపంచం మెచ్చే మేటి వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా అది సాధించగలమన్నారు. ఒక దేశంగా భారత్ ఇతర ప్రపంచానికి అందించగల సాంకేతిక/యాజమాన్య పరిజ్ఞానాలలో అగ్రగామిగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ప్రొఫెసర్ డీఎస్ వు వెలిబుచ్చారు.చివరిగా, కళాకృతి బృందం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలు అల్పాహార విందుతో ముగిశాయి.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago