Telangana

స్వతంత్ర ఉద్యమ పోరాట స్ఫూర్తితో మోడీ ప్రభుత్వ విధానాలపై పోరాటాలు

– సిఐటియు ద్వారానే సమస్యలు పరిష్కారం

– ఈనెల 14న దేశవ్యాప్త నిరసనలు

– కిర్బీ పరిశ్రమలో హ్యాట్రిక్ విజయమందించిన కార్మికులకు విప్లవ అభినందనలు
సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

స్వతంత్ర ఉద్యమ పోరాట స్ఫూర్తితో మోడీ ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు పిలుపునిచ్చారు. శనివారం పటాన్ చెరు పట్టణంలోని ఐలా భవన్ లో జరిగిన కిర్బీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం లో రాములు మాట్లాడుతూ మోడీని అధికారం నుంచి దించుతేనే కార్మిక వర్గానికి, దేశానికి, ప్రజలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడి ప్రభుత్వాన్ని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 14వ తేదీన దేశవ్యాప్తంగా మోడీ విధానాలపై నిరసన చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఆ నిరసనలో కార్మిక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు, వరుసగా మూడోసారి గెలిపించినందుకు విప్లవ అభివందనములు తెలియజేశారు, సీఐటీయు ద్వారానే కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. కార్మికుల హక్కులు, సౌకర్యాల కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. కార్మికులకు నిరంతరం సేవ చేసే కార్మిక సంఘం సీఐటియు అన్నారు. కార్మికులు రాబోయే కాలంలో ఐక్య పోరాటాలకు సిద్ధపడాలని ఐక్య పోరాటాలు చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే రాజయ్య, యూనియన్ జనరల్ సెక్రటరీ విఎస్ రాజు ,మల్లేశం, లకన్ ,సుధాకర్, నాగప్రసాద్, తలారి శీను, రాజేష్, మహేశ్వర్ రెడ్డి, వీరప్ప, ప్రభు తదితర కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతిభా ప్రదర్శన వేదికగా ‘సాధన-2026’

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : లలిత, ప్రదర్శన కళల విభాగం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే ‘సాధన-2026’ను శుక్రవారం గీతం…

19 hours ago

పట్టభద్రులవుతున్న ఎన్.సీ.సీ. క్యాడెట్లకు ఘన వీడ్కోలు

శిక్షణ పూర్తిచేసుకుని లెఫ్టినెంట్ హోదా పొందిన ఏ.ఎన్.ఓ. అజయ్ కుమార్ కు సత్కారం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :…

2 days ago

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…

5 days ago

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…

5 days ago

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

6 days ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

6 days ago