Telangana

స్వతంత్ర ఉద్యమ పోరాట స్ఫూర్తితో మోడీ ప్రభుత్వ విధానాలపై పోరాటాలు

– సిఐటియు ద్వారానే సమస్యలు పరిష్కారం

– ఈనెల 14న దేశవ్యాప్త నిరసనలు

– కిర్బీ పరిశ్రమలో హ్యాట్రిక్ విజయమందించిన కార్మికులకు విప్లవ అభినందనలు
సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

స్వతంత్ర ఉద్యమ పోరాట స్ఫూర్తితో మోడీ ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు పిలుపునిచ్చారు. శనివారం పటాన్ చెరు పట్టణంలోని ఐలా భవన్ లో జరిగిన కిర్బీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం లో రాములు మాట్లాడుతూ మోడీని అధికారం నుంచి దించుతేనే కార్మిక వర్గానికి, దేశానికి, ప్రజలకు భవిష్యత్తు ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడి ప్రభుత్వాన్ని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 14వ తేదీన దేశవ్యాప్తంగా మోడీ విధానాలపై నిరసన చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఆ నిరసనలో కార్మిక వర్గం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు, వరుసగా మూడోసారి గెలిపించినందుకు విప్లవ అభివందనములు తెలియజేశారు, సీఐటీయు ద్వారానే కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. కార్మికుల హక్కులు, సౌకర్యాల కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. కార్మికులకు నిరంతరం సేవ చేసే కార్మిక సంఘం సీఐటియు అన్నారు. కార్మికులు రాబోయే కాలంలో ఐక్య పోరాటాలకు సిద్ధపడాలని ఐక్య పోరాటాలు చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే రాజయ్య, యూనియన్ జనరల్ సెక్రటరీ విఎస్ రాజు ,మల్లేశం, లకన్ ,సుధాకర్, నాగప్రసాద్, తలారి శీను, రాజేష్, మహేశ్వర్ రెడ్డి, వీరప్ప, ప్రభు తదితర కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago