Telangana

రెవెన్యూ సహాయకులకు పేస్కేలు కల్పించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్

_పటాన్చెరులో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గ్రామస్థాయిలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేల్ అందించి వారిని వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంపిక చేసిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సోమవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో పటాన్చెరు నియోజకవర్గంలో వీఆర్ఏలుగా పనిచేసిన ఉద్యోగులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగులు ఉండకూడదని సమన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పదోన్నతి కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. దీంతోపాటు దశాబ్దాల చరిత్ర గల ఆర్టీసీనీ సైతం ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు.పటాన్చెరు నియోజకవర్గంలో విఆర్ఏ లు గా పని పనిచేసిన వారందరూ నేడు ప్రభుత్వ ఉద్యోగులుగా వివిధ శాఖల్లో రాష్ట్ర వ్యాప్తంగా నియామకం జరిగిందని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గానికి పేరు తెచ్చేలా పనిచేసి ప్రజలకు జవాబుదారిగా ఉండాలని ఆయన సూచించారు.

అనంతరం పలువురు వీఆర్ఏలు మాట్లాడుతూ.. సంవత్సరం క్రితం తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం 80 రోజులపాటు నిరవదిక సమ్మె చేసిన సమయంలో దసరా పండుగ వస్తే ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన గొప్ప మనసున్న నాయకుడు ఎమ్మెల్యే జిఎంఆర్ అని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ తమ సమస్యల పరిష్కారానికి అండగా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు.అనంతరం పలువురు విఆర్ఏలకు నియామక పత్రాలు అందజేశారు. విఆర్ఏలతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ భోజనాలు చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీలు దేవానందం, సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసిలు కుమార్ గౌడ్, సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, సీనియర్ నాయకులు బాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, నాగేష్ కురుమ, షేక్ హుస్సేన్, రాజేష్, రాజన్ సింగ్, వీఆర్ఏల సంఘం రాష్ట్ర కోకన్వీనర్ వెంకటేష్, నియోజకవర్గ అధ్యక్షులు షేక్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

6 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago