Telangana

జర్నలిస్టుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి నేడు బంగారు తెలంగాణ సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి అండగా నిలుస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఇటీవల పటాన్చెరులో నిర్వహించిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ప్లీనరీ, టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర మహాసభల విజయవంతం సంపూర్ణ సహకారం అందించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి యూనియన్ ఆధ్వర్యంలో శనివారం కృతజ్ఞత సభ నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, ఐ జే యు జాతీయ ఉపాధ్యక్షులు ఇస్మాయిల్, రాష్ట్ర నాయకులు రమణ, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ శాలువా, మెమొంటోతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేయడంతో పాటు, దేశంలోనే మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

పటాన్చెరు నియోజకవర్గంలోనూ జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే 100 మంది జర్నలిస్టులకు 15 లక్షల రూపాయల విలువైన ఆరోగ్య భద్రత కార్డులు అందించడంతోపాటు, ఇళ్ల స్థలాలను సైతం అందించబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారి ప్రక్కన ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు.సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో.వాస్తవమైన వార్తలు అందించడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని కోరారు.జాతీయ మహాసభలకు పటాన్చెరును వేదికగా ఎంపిక చేసుకొని సభలను విజయవంతం చేయడం పట్ల ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.భవిష్యత్తులోనూ జర్నలిస్టులు చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో యూనియన్ జిల్లా, నియోజకవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago