Telangana

జర్నలిస్టుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి నేడు బంగారు తెలంగాణ సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి అండగా నిలుస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఇటీవల పటాన్చెరులో నిర్వహించిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ప్లీనరీ, టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర మహాసభల విజయవంతం సంపూర్ణ సహకారం అందించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి యూనియన్ ఆధ్వర్యంలో శనివారం కృతజ్ఞత సభ నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, ఐ జే యు జాతీయ ఉపాధ్యక్షులు ఇస్మాయిల్, రాష్ట్ర నాయకులు రమణ, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డిల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ శాలువా, మెమొంటోతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేయడంతో పాటు, దేశంలోనే మొట్టమొదటిసారిగా 100 కోట్ల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

పటాన్చెరు నియోజకవర్గంలోనూ జర్నలిస్టుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే 100 మంది జర్నలిస్టులకు 15 లక్షల రూపాయల విలువైన ఆరోగ్య భద్రత కార్డులు అందించడంతోపాటు, ఇళ్ల స్థలాలను సైతం అందించబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారి ప్రక్కన ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు.సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో.వాస్తవమైన వార్తలు అందించడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలని కోరారు.జాతీయ మహాసభలకు పటాన్చెరును వేదికగా ఎంపిక చేసుకొని సభలను విజయవంతం చేయడం పట్ల ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.భవిష్యత్తులోనూ జర్నలిస్టులు చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో యూనియన్ జిల్లా, నియోజకవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago