పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామం అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం ఘనపూర్ గ్రామంలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న గ్రామపంచాయతీ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, 17 లక్షల రూపాయలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హాయంలో తీవ్ర నిర్లక్ష్యానికి, అభివృద్ధికి నోచుకోని గ్రామాలు నేడు సీఎం కెసిఆర్ దూర దృష్టితో ప్రతి గ్రామం అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తూ, కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించడంతోపాటు ప్రతి కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, సిసి రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందించడానికి ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీల తో పాటు ట్రాక్టర్లు సైతం అందించడం జరిగిందని తెలిపారు. జనాభా ఆధారంగా ప్రతినెల అనేదిలు మంజూరు చేయడంతో పాటు పూర్తి పారదర్శకతతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…