– జాతీయ గణిత దినోత్సవంలో శ్రీవేదభారతి చీఫ్ డాక్టర్ అవధానులు స్పష్టీకరణ
మనవార్తలు ,పటాన్ చెరు:
సున్నా , దశాంశ సంఖ్య , బెనైరీ సంఖ్యలు , ప్రోగ్రెషన్ , ఇన్ఫినిటీ ( అనంతం ) వంటి ఐదు గొప్ప ఆవిష్కరణలను మన భారతీయులే చేశారని శ్రీవేదభారతి ముఖ్య నిర్వహణాధికారి , నిమ్స్ కంప్యూటర్ విభాగం పూర్వ డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ అవధానులు చెప్పారు . గణితశాస్త్రానికి శ్రీనివాస రామానుజన్ చేసిన కృషికి గుర్తింపుగా ప్రతియేటా డిసెంబర్ 22 న నిర్వహించే ‘ జాతీయ గణిత దినోత్సవాన్ని ‘ గురువారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు . స్కూల్ ఆఫ్ సెన్స్డ్లోని గణితశాస్త్ర విభాగం నిర్వహించిన ఈ స్మారక కార్యక్రమంలో డాక్టర్ అవధానులు ప్రాచీన భారతదేశంలోని గణితశాస్త్ర ఆవిష్కరణలపై ప్రసంగించారు .
భారత ఉపఖండంలో గణితానికి వేల సంవత్సరాల గొప్ప చరిత్ర ఉందని , ప్రాచీన భారతీయ గణిత శాస్త్రాలన్నీ సంస్కృతంలో సూత్రాల విభాగం రూపంలో ఉన్నాయని , వాటిలో నియమాలు లేదా సమస్యలను పేర్కొన్నట్టు ఆయన చెప్పారు . ఆర్యభట , వరాహమిహిర , భాస్కర -1,2 , విష్ణుగుప్త , సిద్దసేన , మణిత , శ్రీజిధ్వజ , కళ్యాణవర్మ , సింహతిలకసూరి , కాలకాచార్య , మహావీరాచార్య , భటోత్పల , దేవస్వామి , సత్యాచార్యా , జీవశర్మ వంటి పండితులు గణితంలో విలువెన రచనలు చేసినట్టు డాక్టర్ అవధానులు వివరించారు . ఈ సందర్భంగా ‘ వేద గణితం – యంత్ర అభ్యాసం ( మెషీన్ లెర్నింగ్ ) ‘ అనే అంశంపై స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ప్రొఫెసర్ వీకే మిట్టల్ ప్రసంగించారు .
మెషీన్ లెర్నింగ్ ఎక్కువగా గణిత , గణాంక శాస్త్రాలపై ఆధారపడి ఉందన్నారు . గణితశాస్త్రం మన జీవితంలో ఒక భాగమని , ఆలోచనలో తర్కాన్ని ఇస్తుందని స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు తన స్వాగతోపన్యాసంలో చెప్పారు . ఈ కార్యక్రమంలో గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా , ప్రొఫెసర్ కె.మారుతీప్రసాద్ , ప్రొఫెసర్ బీఎం నాయుడు , డాక్టర్ వంశీకృష్ణతో పాటు పలువురు అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు . గోడపత్రికల రూపకల్పన , గణిత ఫజిల్ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం చేశారు . డాక్టర్ కె.కృష్ణ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…