Hyderabad

మేడే స్ఫూర్తితో దోపిడీ వ్యవస్థ పై పోరాటం_వి. తుకారాం నాయక్

మనవార్తలు ,మియాపూర్:

ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే స్ఫూర్తితో ప్రస్తుత దోపిడీ వ్యవస్థ పై పోరాడాలని MCPI(U) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తుకారాం నాయక్ పిలుపునిచ్చారు.136వ మేడే సందర్భంగా మియాపూర్ డివిజన్ స్టాలిన్ నగర్ లో ఏర్పాటు చేసిన ఎర్ర జెండాను ఎగరేసి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దోపిడీ వ్యవస్థ కొనసాగుతోందని ఈ దోపిడీకి వ్యతిరేకంగా పెట్టుబడిదారి ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా మేడే కార్మికుల పోరాట స్ఫూర్తితో దోపిడీ వ్యవస్థను ఎదుర్కోవాలని అన్నారు. నాడు ఎన్ని గంటల పని విధానం గురించి వందలాది మంది ప్రాణాలు త్యాగాలు చేస్తే నేడు మళ్లీ పెట్టుబడిదారీ వ్యవస్థ ఉధృతమై 12 గంటల పనివిధానాన్ని తీసుకువచ్చిందని అన్నారు.

పెట్టుబడిదారులు కార్మిక హక్కులను కాలరాస్తూ భారత పాలక వర్గాలను తమ గుప్పెట్లో ఉంచుకుని అని ఆరోపించారు. పెట్టుబడిదారి పాలకవర్గాల విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ముజాఫ్ఫార్ అహ్మద్ నగర్ లో కామ్రేడ్ తాండ్ర కళావతి,తుడుం అనిల్ కుమార్, టేకు నరసింహ నగర్ లో శంకర్, నడిగడ్డ తాండ లో కామ్రేడ్ కుంభం సుకన్య, ఓంకార్ నగర్ లో పల్లె మురళి, మియాపూర్ బస్ స్టాండ్ కన్నశ్రీనివాస్, మక్త మహబూబ్ పేటలో మైధం శెట్టి రమేష్, పోగుల ఆగయ్య నగర్ లో కర్ర దానయ్యలు జెండాలు ఎగరవేశారు.

ఈ కార్యక్రమంలో వనం సుధాకర్, ఏ.పుష్ప,బి.రవి, జీ.లావణ్య,దార లక్ష్మి,సుల్తానా,శివాని, గణేష్ ,నాగభూషణం,నర్సింగ్, వెంకటాచారి, రతన్ నాయక్, లలిత, ఇస్సాక్, రాంబాబు, అమీనా,రజియా తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago