కర్నూలు
ఉల్లి కొనుగోళ్లను తక్షణమే ప్రారంభించి రైతులను కార్మికులను ఆదుకోవాలి ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. కర్నూలులో రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో బోరుబావుల కింద మెట్ట భూములలో సుమారు 30 వేల ఎకరాలు ఉల్లి పంట సాగు చేశారని తెలిపారు. పండిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేక రోడ్ల వెంట తిరిగి అమ్ముకునే ఇటువంటి దుస్థితి రైతులకు ఏర్పడింది ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులు హైదరాబాద్ మార్కెట్ కు తీసుకెళ్లినా.. అక్కడ కూడా ధర లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ జోక్యం చేసుకుని చేసుకుని ఉల్లి పంటను కొనుగోలు చేయాలని కోరారు. ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…