కర్నూలు
ఉల్లి కొనుగోళ్లను తక్షణమే ప్రారంభించి రైతులను కార్మికులను ఆదుకోవాలి ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. కర్నూలులో రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రైతులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో బోరుబావుల కింద మెట్ట భూములలో సుమారు 30 వేల ఎకరాలు ఉల్లి పంట సాగు చేశారని తెలిపారు. పండిన పంటను కొనుగోలు చేసే పరిస్థితి లేక రోడ్ల వెంట తిరిగి అమ్ముకునే ఇటువంటి దుస్థితి రైతులకు ఏర్పడింది ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులు హైదరాబాద్ మార్కెట్ కు తీసుకెళ్లినా.. అక్కడ కూడా ధర లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ జోక్యం చేసుకుని చేసుకుని ఉల్లి పంటను కొనుగోలు చేయాలని కోరారు. ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…