Telangana

మెషిన్ లెర్నింగ్ పై అధ్యాపక వికాస కార్యక్రమం….

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఈనెల 26-28 తేదీలలో ‘మెషిన్ లెర్నింగ్ – ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ అనే అంశంపై మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్ఎపీ) నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ప్రొఫెసర్ టి.మాధవి, ప్రొఫెసర్ కె.మంజునాథాచారి సోమవారం సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్లను ఇంజనీరింగ్, టెక్నాలజీకి ఎలా అన్వయించవచ్చో అర్థం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానం, నెప్తుణ్యాలతో పాల్గొనే వారిని సన్నద్ధం చేయడానికి దీనిని రూపొందించినట్టు వారు తెలిపారు. ఇందులో పాల్గొనేవారు ఆచరణాత్మక అవగాహనతో శిక్షణ పొందడమే గాక పరిశోధన సహకారం కోసం ఇతర గ్రూపుల సహకారం కోరవచ్చని చెప్పారు.

మెషిన్ లెర్నింగ్ ప్రాథమిక లక్ష్యం కంప్యూటర్ సిస్టమ్లను రూపొందించడం, డేటాలోని సంక్లిష్ట నమూనాలు, సంబంధాలను విశ్లేషించి అర్థం చేసుకోవడం, ఖచ్చితమైన అంచనాలను రూపొందించడానికి, చర్యలు తీసుకోవడానికి వీలు కల్పించడమన్నారు. ఈ పద్ధతులను వినియోగించి కొత్త సమస్యలను సులువుగా పరిష్కరించగలిగే ఆచరణాత్మక జ్ఞానాన్ని పొందచ్చని నిర్వాహకులు తెలియజేశారు.ఈ ఎఫ్ఎపీని విద్యావేత్తలు, పరిశోధన స్కాలర్లు, బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ చదివే వారికోసం ఉద్దేశించామని, ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను ఈ లింక్ https://forms.gle/aimM5hby3LSUfxD8 link ద్వారా ఈనెల 26వ తేదీలోపు నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాల కోసం కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ | రామకృష్ణ 81060 21619ని సంప్రదించాలని, లేదా rpuvvula@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని వారు సూచించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago