Telangana

తేనెటీగల జాతి అంతం జరిగితే మానవ మనుగడకు ప్రమాదం

– జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యురాలు డాక్టర్ సునీత

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు పట్టణంలోని డాక్టర్ అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ వారి ఆధ్వర్యంలో తేనెటీగల సాగు, దాని యొక్క వాణిజ్య ఉపయోగాలు అనే అంశంపై బుధవారం విద్యార్థులకు సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యురాలు డాక్టర్ సునీత ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ… తేనెటీగల జాతి అంతం జరిగితే మానవ మనుగడకు ప్రమాదం అని గుర్తు చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. పర్యావరణ అనుకూల వ్యాపారాలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. తేనె పెంపకంలో వెలువడే మైనం, ప్రోపోలిస్ యొక్క ఆదాయ వనరుల అవకాశాలను, ఈ కార్యక్రమ నిర్వాహణ కర్త వీరేందర్ విద్యార్థులకు వివరించారు. తక్కువ వ్యవధి, పెట్టుబడితో చేయగల తేనెటీగల పెంపకం ఎంతో ఉపయోగకరమని వైస్ ప్రిన్సిపాల్ అల్లం రెడ్డి అభిప్రాయపడ్డారు. పరపరార్గ సంపర్కం వలన పంటలలో అధిక దిగుబడి పొందవచ్చు అని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ ఉదయ్, డాక్టర్ స్నేహలత, కళాశాల ఆచార్యులు డాక్టర్ రాజిరెడ్డి, రాధిక, కృష్ణ, రవీందర్, హరిత, జానయ్య, స్వప్న, డాక్టర్ భగ్గు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago