Telangana

తేనెటీగల జాతి అంతం జరిగితే మానవ మనుగడకు ప్రమాదం

– జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యురాలు డాక్టర్ సునీత

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు పట్టణంలోని డాక్టర్ అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంటర్ప్రైన్యూర్షిప్ డెవలప్మెంట్ సెల్ వారి ఆధ్వర్యంలో తేనెటీగల సాగు, దాని యొక్క వాణిజ్య ఉపయోగాలు అనే అంశంపై బుధవారం విద్యార్థులకు సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యురాలు డాక్టర్ సునీత ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ… తేనెటీగల జాతి అంతం జరిగితే మానవ మనుగడకు ప్రమాదం అని గుర్తు చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. పర్యావరణ అనుకూల వ్యాపారాలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. తేనె పెంపకంలో వెలువడే మైనం, ప్రోపోలిస్ యొక్క ఆదాయ వనరుల అవకాశాలను, ఈ కార్యక్రమ నిర్వాహణ కర్త వీరేందర్ విద్యార్థులకు వివరించారు. తక్కువ వ్యవధి, పెట్టుబడితో చేయగల తేనెటీగల పెంపకం ఎంతో ఉపయోగకరమని వైస్ ప్రిన్సిపాల్ అల్లం రెడ్డి అభిప్రాయపడ్డారు. పరపరార్గ సంపర్కం వలన పంటలలో అధిక దిగుబడి పొందవచ్చు అని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ ఉదయ్, డాక్టర్ స్నేహలత, కళాశాల ఆచార్యులు డాక్టర్ రాజిరెడ్డి, రాధిక, కృష్ణ, రవీందర్, హరిత, జానయ్య, స్వప్న, డాక్టర్ భగ్గు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

9 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

9 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

9 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

9 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

9 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago