politics

అంతా గణితమయం ! ‘

మనవార్తలు ,పటాన్ చెరు:

_గీతమ్ ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు

మన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలన్నీ గణితమయం అని, ప్రతిదానిలో గణితం ఉండడం వల్లే అది మన జీవితాలను సులభతరం చేస్తోందని నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ సీహెచ్ గోపాలరెడ్డి అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ గణిత శాస్త్రాలు, సాంకేతిక పరిజ్ఞానంలో పెరుగుతున్న వినియోగం అనే అంశంపై శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గణితశాస్త్ర సంఘం ( ఏపీటీఎస్ఎంఎస్ ) సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ సైన్స్డ్ కార్యక్రమాన్ని గణిత శాస్త్ర విభాగం ఏర్పాటు చేసింది. గణితశాస్త్రం స్వచ్ఛమైన ఆలోచనా కళగా, అదే సమయంలో విశ్వవ్యాప్తంగా వర్తించే శాస్త్రంగా విశిష్ట స్థానం సంతరించు కుందని ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి చెప్పారు. గణితం చాలా అధునాతనమైన సాధనంగా అభివృద్ధి చెందిందని, చాలామంది ప్రజలు తమ జీవితాలలో దాని సర్వవ్యాప్తిని కూడా గుర్తించలేరన్నారు.

జీవశాస్త్రం , ఆరోగ్య పరిరక్షణ , కామర్స్, వ్యాపార రంగాలలో కూడా గణితాన్ని వినియోగిస్తారని, అసలు గణితాన్ని ఉపయోగించకుండా సాంకేతికతను ఊహించలేమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాచీన భారతంలో సున్నాను కనుగొన్నారని, గణిత జ్ఞానాన్ని ఉపయోగించే గ్రహణ సమయాన్ని ఖచ్చితంగా అంచనా వేస్తూ పంచాంగాలు రాస్తారని చెప్పారు. జ్యోతిషశాస్త్రం నుంచి ఖగోళశాస్త్రం వరకూ గణితమే ఆవరించి ఉందని డాక్టర్ గోపాలరెడ్డి పేర్కొన్నారు. ఈ సదస్సులో గౌరవ అతిథిగా పాల్గొన్న ఏపీటీఎస్ఎంఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్.కిషన్ మాట్లాడుతూ, గణితం, వాస్తవిక సమస్యలు లేకుండా సైన్స్డ్, ఇంజనీరింగ్ శాస్త్రీయంగా అభివృద్ధి చెందడం సాధ్యం కాదన్నారు. తమ సంస్థ ఆవిర్భావం, అది నిర్వహిస్తున్న కార్యకలాపాలను ఆయన వివరించారు. తదుపరి పరిశోధనా రంగాలను గుర్తించేందుకు ఈ మూడు రోజుల సదస్సు ఉపకరిస్తుందని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు తన స్వాగతోపన్యాసంలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన సదస్సు సావనీర్ ను విడుదల చేసి, అతిథులను సత్కరించారు. ఇంజనీర్లు గణితాన్ని తప్పనిసరిగా నేర్చుకోవలసి వస్తోందని, గణిత జ్ఞానం లేకుండా వారు పెద్దగా అభివృద్ధి సాధించలేరని ఐఐటీ ఖరగ్‌పూర్ డీన్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ఈ మూడు రోజుల సదస్సులో దాదాపు రెండు వందల మంది దేశ నలుమూలల నుంచి తమ పరిశోధనా పత్రాలను సమర్పించినట్టు నిర్వాహకుడు ప్రొఫెసర్ బీఎం నాయుడు తెలియజేశారు. మరో కన్వీనర్ డాక్టర్ శివారెడ్డి శేరి వందన సమర్పణ చేశారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో గీతం స్కూల్ ఆఫ్ సైన్స్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె నగేషా, గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.రెజా, నిర్వాహక కార్యదర్శులు డాక్టర్ పి.నరసింహస్వామి, డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గీతమ్ లో ఘనంగా కాళోజీ జయంతి

కాళోజీ నారాయణరావు 108 వ జయంతిని శుక్రవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. కవిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, తెలంగాణ ప్రజా కవిగా పేరొందిన పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం విదితమే. గీతమ్ లో నెలకొల్పిన కాళోజీ నారాయణరావు విగ్రహానికి అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు ఘన నివాళులు అర్పించారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఎస్ కుమార్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

admin

Recent Posts

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…

2 hours ago

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…

2 hours ago

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

23 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

1 day ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago