politics

అంతర్ విభాగ పరిశోధనలు అవశ్యం…

– గీతం అంతర్జాతీయ సదస్సు ముగింపు ఉత్సవంలో కేయూ డీన్ ప్రొఫెసర్ మల్లారెడ్డి

మనవార్తలు ,పటాన్ చెరు:

సాంకేతికత పురోగమిస్తున్న కొద్దీ అంతర్ విభాగ పరిశోధనలు , జ్ఞానానికి ప్రాముఖ్యం పెరిగిందని వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ మల్లారెడ్డి అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ గణిత శాస్త్రాలు , సాంకేతిక పరిజ్ఞానంలో పెరుగుతున్న వినియోగం ‘ ( ‘ Mathematical Sciences and Emerging Applications in Technology ‘ ( ICMSEAT – 2022 ) అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ఆదివారంతో ముగిసింది . ఆంధ్రప్రదేశ్- తెలంగాణ గణితశాస్త్ర సంఘం ( ఏపీటీఎస్ఎంఎస్ ) సహకారంతో గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ని గణిత శాస్త్ర విభాగం నిర్వహిస్తున్న ఈ ముగింపు ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ , విజయవంతంగా సదస్సును నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు . అలాగే ఏపీటీఎస్ఎంఎస్ సేవలను , దాని వ్యవస్థాపకులను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు .

గౌరవ అతిథిగా పాల్గొన్న ఏపీటీఎస్ఎంఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్.కిషన్ మాట్లాడుతూ , సదస్యుల జ్ఞానాన్ని పెంపొందించి , వినూత్న ఆలోచనలను రేకెత్తించేలా ప్రముఖుల ఆతిథ్య ఉపన్యాసాలు ఈ మూడు రోజులపాటు కొనసాగాయన్నారు . ఈ సదస్సు పరిశోధక విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుందని ఏపీటీఎస్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.జయసుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు . అధునాతన పరిశోధనలు , కొత్త విషయాలను తెలుసుకోవడానికి , కొంగొత్త స్నేహాలు ఏర్పడడానికి ఈ సదస్సు తోడ్పడినట్టు గీతం స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేశ వ్యాఖ్యానించారు . ఈ సదస్సును నిర్వహించేందుకు అవకాశమిచ్చిన ఏపీటీఎస్ఎంఎస్ కార్యవర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ అంతర్జాతీయ సదస్సు నివేదికను కన్వీనర్ ప్రొఫెసర్ బీఎం నాయుడు సమర్పించగా , కార్యదర్శి డాక్టర్ పి.నారాయణస్వామి వందన సమర్పణ చేశారు . మరో నిర్వాహకుడు డాక్టర్ శివారెడ్డి శేరి , గణితశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం . రాజా , డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి తదితరులు సదస్సు నిర్వహణలో తోడ్పడ్డారు .

ఇతర పరిశోధకులు ఏమి చేస్తున్నారో తెలుసుకోవడానికి , సందేహ నివృత్తికి , జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ సదస్సు దోహదపడినట్టు తమ ప్రతిస్పందన ( ఫీడ్ బ్యాక్ ) లో మిజోరాం ఎస్ఐటీ నుంచి వచ్చిన రాధ అభిప్రాయపడ్డారు . సదస్సును ప్రణాళికాబద్ధంగా , ఉపయుక్తంగా నిర్వహించి కొంగొత్త అంశాలు నేర్చుకోవడానికి వీలుకలిగినట్టు పిఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఎం.శ్రీకుమార్ చెప్పారు . సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరితో పాటు పత్ర సమర్పణకు అధ్యక్షత వహించిన వారికి కూడా ప్రశంసా పత్రాలను అందజేశారు . ఏపీటీఎస్ఎంఎస్ కార్యనిర్వాహక సభ్యులతో పాటు ఇతర అతిథులను కూడా పుష్పగుచ్ఛాలు , దుశ్శాలువ , జ్ఞాపికలను ఇచ్చి సత్కరించారు .

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago