మనవార్తలు ,పటాన్ చెరు:
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒకరు మొక్కను నాటాలని మెట్రో రైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ ప్రజలకు పిలుపు నిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్స సందర్బంగా రాజన్ సింగ్ నివాసంలో మొక్కలను నాటారు. అనంతరం మాజీ ఎమ్యెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ పటాన్ చెరు లాంటి కాలుష్యకారక ప్రాంతాలలో పర్యావరణాన్ని కాపాడుకొని పచ్చదనన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు మొక్కలు విరివిగా నాటి కాపాడుకోవాలని అన్నారు .ఇదే సందర్భంలో మెట్రో రైల్ ఆవశ్యకత గురించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళనున్నట్టు మెట్రో మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు విస్తరించడం వల్ల ప్రజల సమయంతో పాటు పర్యావరణం కూడా పరిరక్షించబడుతుందని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ అన్వర్ పటేల్ రాజన్ సింగ్ మెట్టు శ్రీధర్ అబ్దుల్ బాసిత్ మహేష్ పాప రాజు నరేష్ చిన్నా జంగయ్య బంటి వేంకటేష్ శ్రీకాంత్ షేక్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…